తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించింది ఎన్డీయే ప్రభుత్వం. అయితే పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ కాలేదని, మెజార్టీ లేకపోయినా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలతో కోర్టులో వాదిస్తానని చెప్పారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన మంచి తీర్పు ఇస్తుంది బాంబ్ పేల్చారు. లోక్సభలో మెజారిటీ లేకపోయినా విభజన బిల్లు పెట్టారని, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినా దానిని పరిశీలించలేదని చెప్పారు. తాను యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టానని, దీంతో తనను సస్పెండ్ చేశారని తెలిపారు. పార్లమెంట్లో తనను మాట్లాడనీయలేదన్నారు. దీనిపై కూడా కోర్టులో సవాల్ చేస్తున్నానని చెప్పారు. రేవంత్రెడ్డి వ్యవహారం ఏపీకి సంబంధించిన అంశం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రెండు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షుడు గనుక ఆయన వరకే ఇది పరిమితమని చెప్పారు. ఏపీ ప్రజలపై దీని ప్రభావం ఉండదన్నారు.
సెక్షన్ 8, షెడ్యూల్ 10లను అమలు చేయాలంటూ టీడీపీ, ఏపీ సీఎం అడగాల్సిన అవసరం లేదని, ఆ సెక్షన్లు కచ్చితంగా అమలు కావాల్సిందేనని ఉండవల్లి అరుణ్కుమార్ చెప్పారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ ఆనాడే చెప్పారని, ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. హైదరాబాద్ను యునియన్ టెరిటరిగా చేయడంవల్ల పన్నులు ఉండవని, గవర్నర్.. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉంటారని చెప్పారు. చంద్రబాబే కాదు, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణనైనా ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం, నేర పూరితం అని అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ చేసినట్టు రుజువైతే కేసీఆర్కు పదవీ గండం తప్పదని చెప్పారు. చంద్రబాబు ఫోన్ వాయిస్గా విడుదలయిన టేప్లో ఏమీలేదని, అది కోర్టులో కూడా నిలబడదని అన్నారు. చంద్రబాబు మాట్లాడినట్టుగా చెబుతున్న దానిలో తప్పేమీ లేదని, ఆ మాటల్లో నేర పూరితం ఏమీలేదని చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించకపోవడం విశేషం వ్యాఖ్యానించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more