ఐఫీఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్ధిక నేరాలు, నిధులు మళ్లింపులలో అభియోగాలు ఎదుర్కోంటూ లండన్ లో తలదాచుకున్న వివాదాస్పద క్రికెట్ సామ్రాజ్యధినేత లలిత్ మోడీ ఇమ్మిగ్రేషన్ ధరఖాస్తును పరిశీలించాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. లలిత్ మోడీ వ్యవహారంలో ఇన్నాళ్లు తమ ప్రమేయం లేదంటూ బుకాయించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో సుష్మస్వరాజ్, రాజేల ప్రమేయం వుందంటూ ఇన్నాళ్లుగా చేస్తున్న వానను తొలిసారిగా ఒక పత్రాన్ని అధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ బయటపెట్టారు.
ఇన్నాళ్లు వసుంధర రజే అబద్దాలు అడుతూనే ఉన్నారని, ఇక ఇప్పుడు అమె ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పకోక తప్పదని ఆయన డిమాండ్ చేశారు. అమె తప్పుకోని పక్షంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అమెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహరాంలో ప్రధాని కి తమరో ప్రత్యామ్నాయం లేదని కూడా అన్నారు. 2011 ఆగస్టు 18న లలిత్ మోడికీ మద్దతుగా వసుంధర రాజే సంతకం చేశారంటున్న ఏడు పేజీల డాక్యుమెంటును ఆయన మీడియా సమావేశంలో చూపించారు. అయితే ఇంతకీ ఆ ప్రతాలలో ఏముందంటే..
లలిత్ మోడీ దాఖలు చేసిన ఏ ఇమ్మిగ్రేషన్ ధరఖాస్తుకైనా నా మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. అయితే నా సాయం భారత అధికారులకు మాత్రం తెలియకూడదన్న గట్టి నిబంధనతోనే ఇలా చేస్తున్నాను అని అందులో రాజే పేర్కోంది. వసుందధర రాజే ఈ పత్రాన్ని మోడీకి ఇచ్చిన సమయంలో అమె రాజస్థాన్ లో ప్రతిఫక్ష నాయకురాలి హోదాలో వున్నారు. అయితే అప్పటికే లిలిత్ మోడీ పాస్ పోర్టును భారత్ దేశం రద్దు చేయడమే ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో వసుందర రాజే తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more