భారతదేశం... విశాల సంపదకు నిలయం! కానీ.. కొందరు దోపిడీదారులు తమ స్వార్థ సౌలభ్యం కోసం కోటానుకోట్ల రూపాయలను లెక్కల్లో చూపించకుండా దాచేసుకున్నారు. సూటిగా చెప్పాలంటే.. అలా దాచుకన్న డబ్బంతా ‘బ్లాక్ మనీ’ కిందకు వస్తుందన్నమాట! అలా డబ్బులను దాచుకున్న వారిలో వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు ఎక్కువగా వున్నారు. ఈ బ్లాక్ మనీని సదరు వ్యక్తుల నుంచి బయటికి తీయించడం అసాధ్యం కాబట్టి.. ఆర్బీఐ ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. దేశంలో దాగివున్న కోటానుకోట్ల బ్లాక్ మనీని శాశ్వతంగా అరికట్టేస్తే సమస్య వుండదని ఆలోచించిన ఆర్బీఐ.. ఆమేరకు పావులు కదిపింది. ఇంతకీ ఆర్బీఐ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే.. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లు జూన్ 30వ తేదీ నుంచి చెల్లవు.
మరి.. సాధారణ వినియోగదారుల పరిస్థితి ఎలా? అని అనుకుంటున్నారా! అందుకు పరిష్కారం కూడా ఆర్బీఐయే సూచించింది. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లకు బ్యాంకుల్లో మార్చుకోవడానికి వీలు కల్పించింది. అయితే.. అందుకు కేవలం 8 రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఇప్పటికే ఆయా నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ రెండుసార్లు గడువు పొడిగించింది. మొదట జనవరి 1 ముగిసిన ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరులోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని సూచించింది. ఎవరి దగ్గరైనా అలాంటి నోట్లు వుంటే.. దేశవ్యాప్తంగా వుండే ఏ ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి... దానికి సమానమైన నోట్లను పొందవచ్చునని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని.. జూన్ 30 తర్వాత సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది.
2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని ఆర్బీఐ పేర్కొంది. నోటు వెనుకవైపు ముద్రించిన సంవత్సరం వుందని.. ఇక ముందు ముంద్రించే నోట్లకు కింద సంవత్సరం వుంటుందని ఆర్బీఐ తెలిపింది. కాబట్టి.. ప్రతిఒక్కరు గడువు తేదీ ముగిసేలోపు అంటే జూన్ 30లోపు తమ దగ్గరున్న నోట్లను మార్చుకోవాలని అధికారులు పదేపదే సూచిస్తున్నారు. ఏదేమైనా.. ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఈ నిబంధన వల్ల విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీనోట్లు, బ్లాక్ మనీ చాలావరకు నివారించబడుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more