ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో ప్రదర్శిస్తున్న దుందుడుకును తట్టుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. అయితే ఎలాగైనా తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యాలనే ఉద్దేశంతో తెలంగాణ టిడిపి నేతలు తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఓ కేసు పెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆడియో విడుదలైనప్పుడు కూడా కేటీఆర్ వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఓ డిఎస్పీతో రాయభారం నడిపినట్లు ఎ ఛానల్ ఆడియో టేపులను విడుదల చేసింది. అయితే దానిపై కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. అందులో తాను జోక్యం చేసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని అన్నారు. అయితే తాజాగా మరోసారి కేటీఆర్ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
టిఆర్ఎస్ పార్టీలోకి చేరాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, వివేక్ లు తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టిఆర్ఎస్ లో చేరాలని వత్తిడి చేస్తున్నట్లు వారు వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీలో చేరితే నిధులు, పదవులు ఇస్తామని తమను ప్రలోభపెట్టారని వారు వెల్లడించారు. పార్టీలో చేరకపోతే మాత్రం నియోజకవర్గ అభివృద్దికి ఏ విధంగానూ సహకరించబోమని కూడా బెదిరించారని, పార్టీ మారితే కార్పోరేషన్ పదవి ఇస్తామని కూడా వెల్లడించారు. అయితే ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి చేరిన మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వంద కోట్ల ప్యాకేజీ ముట్టినట్లు కూడా వారు తెలిపారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తెలంగాణ సర్కార్ టార్గెట్ గా చేస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు, ఐటి మంత్రి కేటీఆర్ ను టార్గెట్ గా చేసి తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. మరి దీనిపై తెలంగాణ ఏసీబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more