దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ఆడియో వేడుక ఈరోజు (13-06-20126) తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ఈ ఆడియో వేడుక నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘బాహుబలి’ చిత్రబృందం.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎంతో ఘనంగా వేదికను ఏర్పాటు చేసింది. ఈ మొత్తం ఏర్పాట్లను రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే కొన్నాళ్లపాటు తిష్టవేసి పర్యవేక్షించారు.
ఆడియో వేడుకను గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి పూర్తిస్థాయి వ్యూహంతో ఏర్పాట్లు చేయించినట్లు తెలుస్తోంది. భారీ ఖర్చు పెట్టిన తయారుచేసిన ఈ వేడుక సెట్స్ చూపరులను కట్టిపడేసే విదధంగా వుంది. ఈ ఆడియో వేడుకకు చిత్రంలో నటించిన తారాగణం మొత్తం హాజరుకానున్నట్లు ఇదివరకే యూనిట్ స్పష్టం చేసింది. వారికోసం ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతోపాటు వారి సంరక్షణ కోసం భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టంగా చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. తాజా సమాచారం ప్రకారం ‘బాహుబలి’ చిత్రంలో ప్రధానపాత్రల్లో నటించిన ప్రభాస్, రానా కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. వీరిద్దరు తిరుపతికి చేరుకోవడంతో అక్కడి పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. వీరిని చూసేందుకు ఎంతో మంది అభిమానులు తరలివస్తున్నట్లు సమాచారం! ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ తమ అభిమాన నటులను చూసేందుకు ఈ ఆడియో వేదిక దగ్గర తిష్టవేశారని, ఇంకా భారీ స్థాయిలో ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఎం.ఎం. కీరవాణీ స్వరపరిచిన ఈ ఆడియో వేడుక ఇండస్ట్రీలో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి-కీరవాణి కాంబోలో ఇదివరకు వచ్చిన సినిమాల్లో పాటలు బాగానే సక్సెస్ అయ్యాయి కాబట్టి.. ‘బాహుబలి’ ఆడియో కూడా సక్సెస్ అవుతాయని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more