తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో ఓటుకు నోటు కుంభకోణం బట్టభయలైంది. దీంతో అనూహ్యంగా, అకస్మాత్తుగా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేకెత్తాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. బోయగూడలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఇంట్లో రేవంత్ లేరని సంబంధీకులు చెబుతున్నారు. మరోవైపు కాసేపట్లో పోలీసులు రేవంత్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా రేవంత్ అరెస్టు విషయం తెలుసుకున్న తెలంగాణ టీడీపీ నేతలు సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. రాజకీయ కక్షతో తమ ఎమ్మెల్యేను అధికార పక్షం అరెస్టు చేసిందని ఎర్రబెల్లి డీజీపికి ఆరోపించారు.
తెలంగాణ శాసనమండలిలో రేపు శాసనసభ్యుల కోటాలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీకి తగినంత బలం లేకపోవడంతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ తో గత వారం రోజులుగా రేవంత్ బేరసారాలు ఆడుతున్నారని, సమాచారం. మొత్తంగా ఐదు కోట్ల రూపాయలను స్టీఫెన్ కు ఇచ్చేందుకు అంగీకరించిన రేవంత్. ఇవాళ అడ్వాన్సుగా 50 లక్షల రూపాయలను స్టీఫెన్ ఇచ్చేందుకు నేరుగా ఆయన ఇంటికి చేరకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి రేవంత్ తో జరుగుతన్న బేరసారాల విషయమై స్టీపెన్ ఏసీబి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ డబ్బులు ఇస్తున్న క్రమంలో 50 లక్షల రూపాయలను ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more