yadadri | Devotee | KCR | Laxmi Narasimha Swamy | Yadagirigutta

Laxmi narasimha swamy devotees getting problems by telangana cm kcr

yadadri, Devotee, KCR, Laxmi Narasimha Swamy, Yadagirigutta

Laxmi Narasimha Swamy devotees getting problems by Telangana cm KCR. On visiting KCR Yadadri devotees stoped by the security.

నరసింహుడి భక్తులకు కేసీఆర్ చుక్కలు చూపుతున్నారు

Posted: 05/30/2015 08:34 AM IST
Laxmi narasimha swamy devotees getting problems by telangana cm kcr

యాదాద్రి అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా సీఎం ఆలయ అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెద్దగుట్ట వద్ద రాజగోపురం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్తో పాటుగా గవర్నర్ నరసింహన్, చిన్నజీయర్ స్వామి పాల్గొంటారు. అయితే సిఎం బందోబస్తు కోసం గుట్ట మీద ఉన్న హోటళ్లు, లాడ్జులను ముందే మూసివేశారు. అలాగే గుట్ట మీదకు దాదాపుగా వెహికిల్స్ ను అనుమతించడం లేదు. దాంతో గుట్టకు వస్తున్న భక్తులకు మెట్ట మార్గమే మిగిలింది. దాంతో ఆపసోపాలు పడుతూ కొంత మంది భక్తులు గుట్ట మీదకు చేరుకుంటున్నారు. మరికొందరు మాత్రం కేసీఆర్ వస్తే భక్తులకు ఇబ్బంది కలిగేంత హడావిడి అవసరమా అంటూ మండిపడుతున్నారు. మామూలు రోజుల్లో అయితే ఐదు లేదా ఆరు వేల భక్తులు గుట్టకు వస్తుండగా శని, ఆదివారాల్లో ఇరవై నుండి ఇరవైఐదు వేల వరకు భక్తులు వస్తుంటారు. అయితే వేసవి కాలం సెలవులు, శనివారం కావడంతో ఈ ఉదయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. దాంతో గుట్టకు వస్తున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yadadri  Devotee  KCR  Laxmi Narasimha Swamy  Yadagirigutta  

Other Articles