ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చేస్తున్న డిమాండ్ పై కేంద్రం నుండి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. అయితే టిడిపి, బిజెపి గత ఎన్నికల సమయంలో జతకట్టి ఏడాది కావస్తుండటంతో కనీసం ఇప్పటికైనా ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ చేత ప్రకటించాలని టిడిపి, బిజెపి నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, బిజెపి నాయకులు ప్రధాని మోదీని కలిశారు. ప్రత్యేక హోదాను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేవైనా గత ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధానికి సమర్పించిన విజ్ఞాపన పత్రం స్పష్టం చేసింది. ప్రత్యేక కేటగిరీ హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టం హామీలన్నింటినీ అమలు చేసే విషయంలో ఒకటి, రెండు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు శంకుస్థాపనలు, నామమాత్రపు నిధుల విడుదల తప్ప ఇంతవరకూ పెద్దగా ఒరిగిందేమీ లేదన్న టిడిపి పార్లమెంట్ సభ్యులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడగల స్థితికి చేరుకొనేలా రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదాపై బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్న భిన్న వాదనలతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన నెలకొంటున్నదని సుజనా చౌదరి ప్రధానికి వివరించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలలో ఇప్పటి వరకూ అమలైన ప్రాజెక్టులు, మంజూరైన నిధుల వివరాలను హరిబాబు వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయాలను తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఐదు కోట్ల ప్రజానీకానికి అత్యంత భావోద్వేగ అంశంగా తయారైందన్న జెసి దివాకర్ రెడ్డి.. ఈ విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం జరిగినా పర్యవసానాలు దారుణంగా ఉంటాయని కూడా ఆయన ప్రధాని మోడీకి తేల్చిచెప్పినట్లు సమాచారం. మరి ప్రధానికి ఇలా తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీల నాయకులు కలిసి చేసిన వినతిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే అయితే సరిపోదు ఎక్కువ నిధులు కూడా కావాలని ప్రధానికి గతంలో కోరారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more