nepal earthquake moves kathmandu but everest height unchanged experts | earthquake

Nepal earthquake moves kathmandu but everest height unchanged experts

nepal earthquake moves kathmandu, Mt. everest height unchanged expertsNepal earthquake 2015, Nepal, South and Central Asia, Natural disasters and extreme weather, India, World news

The earthquake that devastated Nepal and left thousands of people dead shifted the earth beneath Kathmandu by up to several metres south, but the height of Mount Everest likely stayed the same

పది మీటర్ల మేర ఉత్తర ధిశగా జరిగిన భారత్ భూభాగం

Posted: 04/29/2015 12:46 PM IST
Nepal earthquake moves kathmandu but everest height unchanged experts

నేపాల్‌లో సంభవించిన భూకంపం తాకిడికి భారత్‌లో కొంతభాగం కొద్ది క్షణాల్లోనే నేపాల్ వైపు ఉత్తరంగా పది మీటర్ల వరకు జరిగిపోయిందని అమెరికాకు చెందిన భూభౌతిక శాస్తవ్రేత్తలు తేల్చారు. ఈ జారుడు ఓ వైపున ఖాట్మండు మొదలుకొని పోఖరాన్ దాకా, మరోవైపు మొత్తం హిమాలయ పర్వతాలంత భాగం వెయ్యి నుంచి 2వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో సంభవించింది అని కొలంబియా యూనివర్సిటీలోని లామొంట్-డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీలో అసోసియేటెడ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కాలిన్ స్టార్క్ చెప్పారు.

నేపాల్‌లోని భరత్‌పూర్‌ నుంచి బీహార్ అడుగున ఉన్న శిల (శాస్తజ్ఞ్రులు దాన్ని భూఫలకంగా అభివర్ణిస్తారు) హెటవుడా మీదుగా జనక్‌పూర్ వైపుగా జారిపోయిందని స్టార్క్ చెప్పారు. హఠాత్తుగా సంభవించే ఈ పరిణామంది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరుగుతుంటుందని చెప్పారు. భూమి అడుగున ఉండే ఫలకాలు ఎంత వేగంగా కదులుతున్నాయనే విషయాన్ని భూభౌతిక శాస్తవ్రేత్తలు చాలాకాలంగా గమనిస్తూ వున్నారు. మొత్తం భారత ఉపఖండంలోని భూమి అడుగు భాగం ఏడాదికి 1.8 అంగుళాల వేగంతో నేపాల్, టిబెట్ వైపుగా కదిలిపోతోందనే విషయాన్ని స్టార్క్ ఇంతకు ముందు తాను ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.

భూమి లోపల సంభవించే ఒత్తిడి హిమాలయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించడంతో కొన్ని పర్వతాల ఎత్తు కొన్ని మైళ్లు పెరగడం, పాకిస్తాన్‌ నుంచి బర్మా దాకా ఉన్న ప్రాంతంలో తరచూ భూకంపాలు రావడం జరుగుతోంది. ‘గత శనివారం సంభవించిన భూకంపం ఇంతకుముందు వచ్చిన చాలా భూకంపాలకన్నా పెద్దదని.. అయితే అసాధారణమైనది, అనూహ్యమైనది మాత్రం కాదని స్టార్క్ అన్నారు. 1934లో పది వేల మందిని పొట్టన పెట్టుకున్న బీహార్ భూకంపం తర్వాత గత 81 సంవత్సరాల్లో భారత్‌లోని భూమి అడుగు భాగం నేపాల్ వైపుగా దాదాపు 12 అడుగులు కదిలిపోయిందని ఆయన చెప్పారు.

భూకంపం తాకిడికి నేపాల్ రాజధాని ఖాట్మండు నగరం కింద భూమి కొన్ని మీటర్ల మేర దక్షిణం వైపునకు జరిగిపోయిందని, అయితే ఎవరెస్టు పర్వతం ఎత్తు మాత్రం అంతే ఉంటుందని బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు సైతం అంటున్నారు. అంతేకాదు భూకంపం భారత ఉపఖండాన్ని యూరేషియా నుంచి వేరు చేసే భూఫలకం అయిన హిమాలయాల ఫలకం సరిహద్దుల్లో సంభవించి ఉండవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal  nepal earthquake  kathmandu  everest  india  

Other Articles