నేపాల్లో సంభవించిన భూకంపం తాకిడికి భారత్లో కొంతభాగం కొద్ది క్షణాల్లోనే నేపాల్ వైపు ఉత్తరంగా పది మీటర్ల వరకు జరిగిపోయిందని అమెరికాకు చెందిన భూభౌతిక శాస్తవ్రేత్తలు తేల్చారు. ఈ జారుడు ఓ వైపున ఖాట్మండు మొదలుకొని పోఖరాన్ దాకా, మరోవైపు మొత్తం హిమాలయ పర్వతాలంత భాగం వెయ్యి నుంచి 2వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో సంభవించింది అని కొలంబియా యూనివర్సిటీలోని లామొంట్-డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీలో అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పని చేస్తున్న కాలిన్ స్టార్క్ చెప్పారు.
నేపాల్లోని భరత్పూర్ నుంచి బీహార్ అడుగున ఉన్న శిల (శాస్తజ్ఞ్రులు దాన్ని భూఫలకంగా అభివర్ణిస్తారు) హెటవుడా మీదుగా జనక్పూర్ వైపుగా జారిపోయిందని స్టార్క్ చెప్పారు. హఠాత్తుగా సంభవించే ఈ పరిణామంది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా జరుగుతుంటుందని చెప్పారు. భూమి అడుగున ఉండే ఫలకాలు ఎంత వేగంగా కదులుతున్నాయనే విషయాన్ని భూభౌతిక శాస్తవ్రేత్తలు చాలాకాలంగా గమనిస్తూ వున్నారు. మొత్తం భారత ఉపఖండంలోని భూమి అడుగు భాగం ఏడాదికి 1.8 అంగుళాల వేగంతో నేపాల్, టిబెట్ వైపుగా కదిలిపోతోందనే విషయాన్ని స్టార్క్ ఇంతకు ముందు తాను ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.
భూమి లోపల సంభవించే ఒత్తిడి హిమాలయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించడంతో కొన్ని పర్వతాల ఎత్తు కొన్ని మైళ్లు పెరగడం, పాకిస్తాన్ నుంచి బర్మా దాకా ఉన్న ప్రాంతంలో తరచూ భూకంపాలు రావడం జరుగుతోంది. ‘గత శనివారం సంభవించిన భూకంపం ఇంతకుముందు వచ్చిన చాలా భూకంపాలకన్నా పెద్దదని.. అయితే అసాధారణమైనది, అనూహ్యమైనది మాత్రం కాదని స్టార్క్ అన్నారు. 1934లో పది వేల మందిని పొట్టన పెట్టుకున్న బీహార్ భూకంపం తర్వాత గత 81 సంవత్సరాల్లో భారత్లోని భూమి అడుగు భాగం నేపాల్ వైపుగా దాదాపు 12 అడుగులు కదిలిపోయిందని ఆయన చెప్పారు.
భూకంపం తాకిడికి నేపాల్ రాజధాని ఖాట్మండు నగరం కింద భూమి కొన్ని మీటర్ల మేర దక్షిణం వైపునకు జరిగిపోయిందని, అయితే ఎవరెస్టు పర్వతం ఎత్తు మాత్రం అంతే ఉంటుందని బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు సైతం అంటున్నారు. అంతేకాదు భూకంపం భారత ఉపఖండాన్ని యూరేషియా నుంచి వేరు చేసే భూఫలకం అయిన హిమాలయాల ఫలకం సరిహద్దుల్లో సంభవించి ఉండవచ్చని కూడా అభిప్రాయపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more