కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాలీడే తర్వాత ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. వచ్చీరాగానే కిసాన్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్... ఆ తర్వాత భూసేకరణ బిల్లు వల్ల రైతులకు కలిగే నష్టంపై పార్లమెంట్లో గళం విప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్... పంజాబ్ పర్యటన చేపట్టారు. సుమారు రెండు నెలల విరామం తర్వాత స్వదేశం తిరిగి వచ్చిన రాహుల్ గాంధీలో కొత్త కళ కనిపిస్తోంది. అదే సమయంలో భూసేకరణ బిల్లు కాంగ్రెస్కు వరంగా పరిణమించింది. ఆ బిల్లును అస్త్రంగా చేసుకున్న రాహుల్... కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. భూసేకరణ బిల్లును పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్... ఇప్పుడు నేరుగా రైతుల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా రైతుల సమస్యలను తెలుసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ రైల్వే స్టేషన్ వెళ్లి సచ్ఖండ్ ఎక్స్ప్రెస్లో ఓ జనరల్ బోగీ ఎక్కి కూర్చున్నారు. ప్రయాణికులతో ముచ్చటించారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు... భూసేకరణ బిల్లుపై రైతులు ఏమను కుంటున్నారో తెలుసుకోవడానికే పంజాబ్ పర్యటన చేపట్టానని తెలిపారు. పంజాబ్ ధాన్య భాండాగారంగా పేరుపొందిన గోవింద్గఢ్, అంబాలా ప్రాంతాలతోపాటు ప్రసిద్ధ ఖన్నా మండీని సందర్శించిన రాహుల్.. పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతుల భూమిని లాక్కునేందుకు భూసేకరణ సవరణ చట్టం తెస్తోందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మాత్రం రాహుల్ యాత్రను కొట్టిపారేశారు. రాహుల్ను పార్ట్టైమ్ పొలిటీషియన్గా అభివర్ణించారు. అయితే రైతు వ్యతిరేకి అయిన బీజేపీ రాహుల్ను రైతు వ్యతిరేకిగా పేర్కొనడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఏదేమైనా... భూసేకరణ బిల్లుపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని.. కాంగ్రెస్కు పునరుజ్జీవం తీసుకురావాలని రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 9,10 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. పంటలు నష్టపోయిన రైతులను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సెగ్మెంట్ నుంచి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది. రాహుల్ పర్యటన షెడ్యూల్ కోసం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుల ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్గాంధీ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా రాహుల్ ప్రస్తుతం పంజాబ్లో పర్యటిస్తున్నారు. రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more