ప్రముఖ హాలీవుడ్ నటి, బేవాచ్ స్టార్, జంతు హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ అభ్యర్థనను కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కాదనలేమని తేల్చిచెప్పారు. చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని కోరిన పమేలా అండర్ సన్ విజ్ఞప్తిని ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. మూగజీవులను హింసించడం వేరు, పండుగలకు, దేవాతామూర్తాల ఉత్సవాలకు వాటిని వినియోగించడం వేరని ఆయన చెప్పారు.
పమేలా అండర్ సన్ నుంచి తనకు ఈ మెయిల్ అందిందని చెప్పిన ఆయన.. ఏనుగుల వినియోగంపై చూపిన అమెకున్న శ్రద్దను అభినందిస్తూనే.. తాము ఏనుగుల అంబారీపై దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపులో నిబంధనలకు అనుగూనంగానే వ్యవహరిస్తామన్నారు. తమ రాష్ట్ర జంతువుల చట్టంలో వున్న నిబంధనల మేరకు వాటిని ఉత్సవాలు, పండుగలలో వినియోగిస్తామన్నారు. అయితే మూగజీవాలను హింస జరుగుతుందంటూ అమె వ్యక్తం చేసిన ఆవేదనకు ఇక్కడ అస్కారం లేదన్నారు. ఏనుగులను ఎవరూ హింసించరని అన్నారు. ఇక ఏనుగులను దేనికీ వినియోగించరాదన్న పమేలా అండర్ సన్ వాదనను కూడా ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. ఇది భక్తుల విశ్వాసాలతో కూడకున్నదని, దీనిపై ఇంతకుమించి తాను మాట్లాడనని చెప్పారు.
ఈ నెల 29న జరుగనున్న చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని కోరుతూ పమేలా అండర్ సన్..కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్కు ఈ మెయిల్ చేసింది. ఏనుగులని గొలుసులతో కట్టేసి, బలవంతంగా ఎండలో తిప్పడం వల్ల అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా అసౌకర్యానికి గురి అవుతారని అందులో పేర్కొంది. నిర్భందించి ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే..అని ముఖ్యమంత్రికి రాసిన లేకలో పమేలా అండర్ సన్ పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more