కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ఞాతం వీడి స్వదేశానికి తిరికి వచ్చినప్పటి నుండి ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా ఎదిగేందుకు తన ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆనందం కలిగిస్తున్నాయి. బుధవారం లోక్సభలో అంతర్జాలం తటస్థవైఖరి గురించి వాదిస్తుంటే సోనియా ఆయనవైపు గర్వంగా చూస్తుండిపోయారు. రాహుల్ గాంధీలో రాజకీయంగా ఆత్మవిశ్వాసం పెరగటం పట్ల సోనియా గాంధీ సంతృప్తితో ఉన్నారు.
అజ్ఞాతవాసం రాహుల్లో పెనుమార్పు తెచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే రైతుల ర్యాలీ నిర్వహించి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్ బుధవారం అంతర్జాలం తటస్థవైఖరి అంశంపై లోక్సభలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రయత్నించారు. ఈ అంశంపై మాట్లాడిన ఆయన దేశంలోని యువత అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నించారు. అంతర్జాలం తటస్థ విధానంకోసం దేశంలోని దాదాపు పది లక్షల మంది యువకులు అంతర్జాలంపై సంతకాల సేకరణ జరిపారు. రాహుల్ గాంధీ లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం నుండి సమాధానం రాబట్టటం ద్వారా ఆ యువకులకు నాయకుడుడైపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం జంతర్మంతర్ వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో రాజస్థాన్కు చెందిన ఒక రైతు చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం లేడీ హార్డింగే ఆసుపత్రికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. గతంలో రాహుల్ గాంధీ ఎప్పుడు ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. లోక్సభలో ఎప్పుడు ఆఖరు వరుసలో కూర్చునే రాహుల్, రెండో విడత సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి రెండో వరుసలో కూర్చుని సభా కార్యక్రమాలను పరిశీలించటంతోపాటు పార్టీ ఎంపీలకు పరిస్థితుల ఆధారంగా సూచనలు ఇస్తూ ఉత్సాహ పరుస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్న రాహుల్ అనతి కాలంలోనే లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడి పదవి చేపట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more