తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కాకతీయ విషన్ కాస్తా.. కమీషన్ కాకతీయగా మారిందని గతంలోనే విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కేవలం కొంత మంది అనుకూల నేతలకు కాంట్రాక్ట్ కేటాయించారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, టిడిపి నేతలు మిషన్ కాకతీయపై మండిపడుతున్న ప్రభుత్వం మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. కాకతీయ మిషన్ లో భాగంగా పలు జిల్లాల్లో చెరువుల పునరుద్దరణ పనులను కూడా ప్రారంభిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొ్త ఆలోచన రేకెత్తిస్తున్నాయి. కాకతీయ మిషన్ లో కమీషన్ గురించి కాకుండా కిషన్ రెడ్డి కలర్ గురించి గొంతెత్తుతున్నారు.
మిషన్ కాకతీయ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ సొమ్ముతో గులాబీమయం చేయడానికే వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిషన్ కాకతీయలో గడ్డపార, పార, తట్ట, కండువాలే కాకుండా చేతులు కడుక్కునే జగ్గు, చేతులు తుడుచుకునే రుమాలు కూడా గులాబీ రంగున్నవే వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యక్రమంలాగా మిషన్ కాకతీయ చేపడితే ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. పనులు పూర్తయ్యేదాకా ప్రతిపక్షాలను, నిపుణులైన రిటైర్డు ఇంజనీర్లను భాగస్వామ్యం చేస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని కిషన్రెడ్డి సూ చించారు. రెండురోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించడం తప్ప ఆచరణాత్మక నిర్ణయాలేమీ తీసుకోలేదని విమర్శించారు. మొత్తాన్ని అన్ని పార్టీలు కమీషన్ ల గురించి మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం కలర్ గురించి మాట్లాడారు. అయినా ప్రభుత్వం వారిదే అయినపుడు ఆ మాత్రం రంగు పడదా ఏంటని కొంత మంది తిరిగి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారట.
**అభినవచారి**
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more