జమ్ము కాశ్మీర్ లో వేర్పాటువాదులు మరీ రెచ్చిపోతున్నారు. భారత్ భూభాగంలొ ఉంటూ పాకిస్థాన్ జెండాను చేతపట్టి, పాక్ కు అనుకూలంగా నినాదాలు చేసి సయ్యద్ అలీ షా గిలానీ వివాదానికి తెర తీశారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ గడ్డపై పాకిస్తాన్ జిందాబాద్ అంటే సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతి వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్ సరుూద్కు ఆయన సూచించారు. శ్రీనగర్ శివార్లలో జరిగిన ఓ ర్యాలీలో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ భారత్ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పాకిస్తాన్ జెండా ప్రదర్శించడంపై రాజ్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన వివరాలు తెలుసుకున్నారు. జాతి భద్రత, ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని ముఫ్తీకి రాజ్నాథ్ స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కూడా గిలానీ ర్యాలీ వ్యవహారం, ఏం జరిగింది పూర్తి వివరాలు హోమ్మంత్రికి వివరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జాతి వ్యతిరేక శక్తులను ఉపేక్షించేది లేదని, అలాంటి సంస్థలు, వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని రాజ్నాథ్ ఆదేశించారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. వేర్పాటువాద కార్యకలాపాలు, వాటిని ప్రోత్సహిస్తున్న శక్తులను కట్టడి చేయండి అని ఆయన చెప్పారు. ఐదేళ్ల విరామం తరువాత వేర్పాటువాద నాయకుడు గిలానీ ర్యాలీకి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత నెలలో జైలు నుంచి విడుదలైన మసరాత్ అలం, గిలానీ మద్దతుదారులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ఊపడమే కాకుండా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. 2010 తరువాత గిలానీ బహిరంగంగా వచ్చి పాల్గొన్న ర్యాలీ ఇది. అప్పట్లో అతడి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో 100 మంది యువకులు మృతి చెందారు. వారంపాటు రాష్ట్రాన్ని కుదిపేసిన హింసాత్మక ఘటనల్లో ఉగ్రవాది అలం కీలక భూమిక పోషించాడు. ఇటీవల అతడిని పిడిడి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి హైదర్పొరలోని గిలానీ నివాసం వరకూ పెద్ద ప్రదర్శన చేశారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more