బాబ్బాబ్. ఆ పని మాత్రం చెయ్యకండి అంటూ ఓ ప్రభుత్వ సంస్థకు ఏకంగా లక్ష మెయిల్స్ వచ్చాయి. ఏంటీ.. లక్షా అనుకోకండి అది అక్షరాల నిజం. ఇంతకీ విషయం ఏంటంటే ఇంటర్నెట్ స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకొని యధాతథ స్థితిని కొనసాగించాలని భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు కోరుతున్నారు. అందుకోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు దాదాపు లక్ష మెయిల్స్ను savetheinternet.in. ద్వారా పంపించారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు మరికొందరు కలిసి భారీ స్థాయిలో ఈ విషయంలో స్పందించారు.
వాట్సాప్, ఫ్లిఫ్కార్ట్, స్కైప్వంటి కొన్ని ప్రత్యేక యాప్లు, వెబ్సైట్లను వాడే వ్యక్తుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయడమే కాకుండా, మరికొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ నిబంధనలు తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం వారం రోజుల్లోగా అభిప్రాయం తెలపాల్సిందిగా కోరింది. దీంతో ఇంటర్నెట్ వినియోగదారులు, డీలర్లు భారీగా స్పందించి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరారు.
*అన్ని వెబ్ సైట్ లను ప్రభుత్వం ఒకేలా ట్రీట్ చెయ్యనుంది. ఎక్స్ ట్రా స్పీడ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
*అన్ని సైట్లను, అన్ని వైబ్ సూట్లలోని కంటెంట్ ను యాసిస్ చెయ్యడానికి వీలుపడదు.
*ఇటంర్నెట్ ప్రొవైడర్ ఖచ్చితంగా తన యూజర్లు ఎంత డాటా వాడుతున్నారు. ఏ సైట్లకు వాడుతున్నారొ వివరాలు తెలపాల్సి ఉంటుంది.
*నెదర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి విధానం అమలులో ఉంది.
*వాట్సాప్, ఫేస్బుక్,ఫ్లిప్కార్ట్ వంటి సోషల్ మీడియా సైట్ల వాటి వల్ల సైబర్ నేరాలు పెరిగిపోవడంతో వీటికి అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ అడుగులు వేసింది.
* ఈ సైట్లు వాడుతున్న వారి నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయ్యాలని ట్రాయ్ నిర్ణయించింది.
* అతిగా వాడుతున్న సోషల్ మీడియా సైట్లలో కొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ యోచిస్తోంది.
* భారత్ లో కూడా నెట్ ను అదుపులో ఉంచాలని చూస్తున్న ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది.
* ఇంటర్నెట్ ను రక్షించండి అంటూ నెటిజన్లు ట్రాయ్ కు ఏకంగా లక్ష మెయిల్స్ పంపడం వార్తలకెక్కింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more