మక్కామసీదు కేసులో నిందితులుగా వున్న వికారుద్దీన్ తోపాటు అతడి నలుగురు సహచరులను ఇటీవలే పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చిన విషయం తెలిసిందే! వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తున్న తరుణంలో.. ఆ తీవ్రవాదులు పోలీసులపై వెకిలి చేష్టలు, దురుసు మాటలతో కవ్వించారు. అనంతరం మూత్రం పోసుకునేందుకు నిందుతులు కోరగా.. మార్గమధ్యంలో వరంగల్ జిల్లా జనగామ వద్ద పోలీసులు వ్యాన్ ను నిలిపారు. ఇదే అదనుగా బావించిన నిందితులు.. జైలు వార్డెన్ నుంచి తుపాకీ లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అత్మరక్షణ కోసం కాల్పులు చేయగా.. వికారుద్దిన్, సులేమాన్ సహా ఐదుగురు ఐఎస్ఐ సభ్యులు మరణించారు. ఈ మేరకు జరిగిన సంఘటనను ఎస్కార్ట్ పోలీసులు ఇదివరకే వర్ణించారు.
అయితే.. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మైనారిటీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. వికార్ ను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని ఆరోపించాయి. ఇక వికార్ తండ్రి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. పోలీసులు కావాలనే తన కొడుకును హతమార్చారని పేర్కొన్నారు. మరోవైపు నిందితుల మృతదేహాలు వ్యాన్ లోనే వుండగా, వారి కూర్చున్న సీట్లకు - వారి చేతులకు బేడీలు వేసి వున్నాయి. ఈ క్రమంలోనే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఎన్ కౌంటరేనని కొందరు అనుమానిస్తున్నారు. ఇలా చాలామంది పలురకాలుగా ఈ ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపించాని డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్ లో వెలుగుచూసిన నకిలీ ఎన్ కౌంటర్ తరహాలోనే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగిందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. లష్కర్-ఏ-తోయిబా గ్రూపుకు సంబంధించిన కొందరు తీవ్రవాదులు ముంబై నుంచి గుజరాత్ లోకి ఎంటరయ్యారని తెలిసిన నేపథ్యంలో అక్కడి పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అయితే.. ఈ కేసు విచారణలో అందులో ఒకరు ఉగ్రవాది కాదని తేలింది. దాంతో అది ఫేక్ ఎన్ కౌంటర్ గా ముద్రించబడింది. ఆ తరహాలోనే పోలీసులు కట్టుకథలు అల్లేసి.. వికారుద్దీన్ కాల్చి చంపి, ఎన్ కౌంటర్ గా చెప్పుకుంటున్నారని డిగ్గీరాజా అనుమానం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more