సిగరెట్ కాన్సర్ కారకం, అరోగ్యానికి హానికరం అంటూ స్వయంగా సిగరెట్ తయారీ సంస్థలే. తాటికాయంత పెద్ద అక్షరాలతో సిగరెట్ పెట్టలపై రాస్తుంటే.. అలాంటిదేమి లేదని బల్లగుద్ది వాదిస్తున్నారు అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ తో క్యాన్సర్ వస్తుందని అనుకోవడం మూర్ఖత్వమని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని పేర్కోన్నారు.
పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా హెచ్చరిక చిహ్నాలు 85శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బీజేపీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెట్టింది. సదరు ఎంపీ, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003పై వేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు కూడా కావడం గమనార్హం.. ‘పొగాకుతో కేన్సర్ వస్తుందని భారత్లో ఏ పరిశోధనా తేల్చలేదు. పరిశోధనలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్లమంది పనిచేస్తున్నారు’ అని దిలీప్ గాందీ వ్యాఖ్యానించారు.
కాగా ఈ వ్యాఖ్యాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించరాదని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. ఎక్కడ పరిశోధనలు జరిగాయన్నది ముఖ్యం కాదన్నారు. ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న విషయాలలో నిజముందని , ప్రజారోగ్యానికి సంబందించిన అంశంలో తాము ఎట్టి పరిస్థితిలో రాజీ పడబోమని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more