భారతీయ జనతా పార్టీ మరోసారి పార్టీ కార్యకలాపాలపై దృష్టిసారించింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత భాజపా లో కొంత నిరుత్సాహం కనిపిస్తున్నా, దాని నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా మోదీ హవాతో భాజపాకు మంచి ఓట్లు వచ్చినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అసలు మోదీ ప్రభావం కనిపించలేదు. సాధారణ ఎన్నికల్లో భాజపాకు తగ్గిన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడానికి నడుంబిగించింది భాజపా నాయకత్వం. అందులో భాగంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పార్టీని పటిష్ఠ పరచడానికి ఓ కొత్త పథకాన్ని రచించారు.
భాజపాకు ఉత్తర భారతంలో ఉన్నంత ఓట్ బ్యాంక్ దక్షిణ భారతంలో లేదన్నది నిజం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే భాజపా కనీసం ఉనికికి కూడా ఇబ్బంది పడుతోంది. అయితే తాజాగా అమిత్ షా ఇలాంటి రాష్ట్రాలను ఏడింటిని ఎంచుకొని, వాటికి కేంద్ర మంత్రులను అబ్జర్వర్ గా నియమించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డా ఆంధ్రప్రదేశ్కు, పవర్ మినిస్టర్ పీయూష్ గోయల్ తమిళనాడు, పాండిచ్చేరిలకు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పశ్చిమబెంగాల్, రాజవ్ ప్రతాప్ రూఢీ కేరళ, ధర్మేంధ్ర ప్రధాన్ అస్సాం, మహేష్ శర్మ ఒరిస్సా, హంసరాజ్ తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నియమించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో భాజపా ఇలాంటి మార్పులను కల్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కొత్తగా ఏడు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు ఎలాంటి మార్పులను తీసుకు వస్తారో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more