రాజధాని గ్రామాల్లో పర్యటించి, అక్కడి ప్రజలను కలిసి వారి సమస్యలను విన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించారు. భూములను సేకరించడం అవసరే కానీ అందుకు చిన్న రైతుల బ్రతులకు చిద్రం చెయ్యడం ఏంటని పవన్ ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంతోపాలనాధ్యక్షత కలిగిన నేత అని కితాబిస్తూనే, రైతుల పక్షాన మాట్లాడారు. అయితే పవన్ ప్రశ్నలను కొందరు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న భూసేకరణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అన్నంతగా ప్రచారం చేశారు. అయితే దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. జనసేన పార్టీ ద్వారా ప్రజలకు మంచి చెయ్యాలని చూస్తున్న వారిపై ఇలాంటి వ్యంగార్థాలు తియ్యడం ఏంటని దుమ్మెత్తిపోశారు. నిర్దిష్టమైన ప్రణాళికతో పవన్ దూసుకువెళుతున్నారని వారు తెలిపారు. వపన్ పై దుష్ప్రచారం చేస్తే, ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మరోపక్క జనసేన అధినేత పవన్కల్యాణ్ తమకు కావాల్సిన వ్యక్తి అని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్బాబు అన్నారు. పవన్ కల్యాణ్ ఏపీకి మంచి రాజధాని కవాలని కోరుకుంటున్నారని మంత్రులు చెప్పారు. ఒక్క మనిషి 23 ఎకరాల్లో ఇల్లు కట్టుకోగాలేంది... రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే రాజధాని కోసం 32వేల ఎకరాలు తీసుకోవడం తప్పా అని వారు ప్రశ్నించారు. ఏడు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని, మిగిలిన భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చి, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్రజల బాగుకోసం మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేశారని, అంతేకానే ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టంగా మీడియా ద్వారా తెలిపారు, అయినా కొందరు కావాలనే కొత్త అర్థాలు తీయడంపై వపన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more