దాదాపు మూడు దశాబ్దాలుగా నక్సల్స్ సమస్యతో పోరాడుతున్న చత్తీస్గఢ్ పోలీసులు ఇప్పుడు రేడియో ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేరువ కావడానికి, వారి విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రాష్ట్ర పోలీసు విభాగం స్థానిక గిరిజన భాషలైన చత్తీస్ఘరీ, హల్బీ, గోండీతో పాటుగా హిందీలో 30కి పైగా జింగిల్స్ (ప్రచార నినాదాలు)ను రూపొందించింది. ‘మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ముఖ్యంగా బస్తర్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువ కావడానికి రేడియో ఒక బలమైన సాధనం. ‘నక్సలిజం కారణంగా అభివృద్ధి ఫలాలు వారికి ఎలా అందడం లేదన్న మా సందేశాన్ని బస్తర్ ప్రాంతంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశం’ అని రాష్ట్ర పోలీసులు తెలిపారు.ఈ జింగిల్స్ ద్వారా పోలీసులు నక్సల్స్కు తమ ఉద్యమాన్ని వదిలిపెట్టి జన జీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేయడంతో పాటు విద్య, అభివృద్ధి ఎంత ముఖ్యమో గ్రామస్థులకు తెలియజేస్తామని పోలీసులు అంటున్నారు.. గ్రామస్థులకు, గ్రామ పెద్దకు మధ్య సంభాషణల రూపంలో ఉండే జింగిల్స్లో నక్సల్స్ తమ ఉద్యమంలో చేరేలా గ్రామస్థులను ప్రోత్సహించడం ద్వారా వారిని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో గ్రామ పెద్ద వారికి చెప్తాడు. అంతేకాదు నక్సల్స్ ఉద్యమం అభివృద్ధిపథంలో ఎలా అడ్డంకిగా మారుతోందో, ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆస్పత్రులు, పంచాయతీ భవనాలు అభివృద్ధి చెందకుండా ఎలా అడ్డుకుంటున్నాయో కూడా అవి ప్రధానంగా వివరిస్తాయి.
జగదల్ పూర్ జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న తమ సబ్ స్టేషన్నుంచి ఆకాశవాణి గత నెలనుంచి ఈ జింగిల్స్ను ప్రసారం చేయడం ప్రారంభించింది. ఉదయంనుంచి సాయంత్రం దాకా ప్రతి అరగంటకోసారి వాటిని ప్రసారం చేస్తున్నారు. చత్తీస్గఢ్ మాజీ డిజిపి విశ్వరంజన్ పోలీసులు చేపట్టిన ఈ చర్య చాలా మంచి పని అని ప్రశంసిస్తూ, గిరిజనులు మావోయిస్టు సిద్ధాంతానికి దూరం కావడంలో ఇది విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. గ్రామస్థులను జన జీవన స్రవంతివైపు ఆకర్షించడానికి ఇది ఓ మంచి ఆలోచన. దీని ఫలితాలు సమీప భవిష్యత్తులోనే కనిపిస్తాయి అని ఆయన అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more