తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. రెంటికి చెడ్డ కావడిలా మారింది ఆ పార్టీ పరిస్థితి. తెలంగాణ ప్రకటన చెయ్యడం వల్ల ఒక ప్రాంతంలో పార్టీకి దెబ్బపడ్డా మరో ప్రాంతంలో మాత్రం లాభముంటుందని భావించిన, కాంగ్రెస్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకే పరిమిత మైంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఏకంగా పుట్టగతులు లేకుండా పోయాయి. తెలంగాణ నేతల మాటలను నమ్మి కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పుపై అధిష్టానం గుర్రుగా ఉంది. తెలంగాణ నేతల మాటలపై ఏ మాత్రం నమ్మలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్, ప్రస్థుతం తెలంగాణలోనైనా పార్టీని కొంత గాడిన బెట్టాలని అనుకుంటోంది.
అందులో భాగంగానే కాంగ్రెస్ సీఎల్పీ పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశముందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత జానారెడ్డి మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ మెజారిటీ సభ్యులు ఆయన వ్యవహారశైలి పై ఆగ్రహంగా ఉన్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పార్టీ పెద్దలకు నివేదించారని సమాచారం. వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ఆయన స్థానంలో కొత్త నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలోనూ, తెలంగాణ వ్యాప్తం గా కాంగ్రెస్ నుంచి వలసలను నిరోధించడంలోనూ సీఎల్పీ నేతగా ఆయన వైఫల్యం చెందారని పార్టీ భావి స్తోంది. జానారెడ్డిని తొలగించాలంటూ డజనుమందికిపైగా ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సచివాలయం తరలింపు, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల వంటి అంశాల్లో విపక్షనేత కనీస స్థాయిలోనూ స్పందించలేదని ఫిర్యాదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more