దేశంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు హద్దులు దాటుతున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే ఎన్నికల్లో నేతలు హామీలివ్వడం అలవాటైపోయింది. తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి మిగితా రాష్ట్రాలకు కాస్త భినం. భిన్నం అంటే ఇక్కడ ఎన్నికల్లో హామీలు ఇవ్వరని కాదు అన్ని రాష్ట్రాల కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది హామీల వర్షం.
తమిళనాడు ప్రభుత్వం విద్యార్ధులకు ఈ ఏడాది కూడా లాప్ టాప్ లు ఉచితంగా ఇస్తోంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది కలిపి పదకొండు లక్షల లాప్ టాప్ లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత మూడు ఏళ్లలో సుమారు ఇరవై లక్షల లాప్ టాప్ లను ప్రభుత్వం పంపిణీ చేసింది. హైస్కూల్ , కాలేజీల విద్యార్దులకు ఈ లాప్ టాప్ లు పంపిణీ చేస్తారు.వీటి వ్యయం మొత్తం పదకుండు వందల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు.అన్నా డి.ఎమ్.కె. ఎన్నికల హామీలలో భాగంగా లాప్ టాప్ లు ఇస్తామని ప్రకటించింది.తదనుగుణంగా వీటిని పంపిణీ చేస్తున్నారు.
మొత్తానికి తమిళనాట రాజకీయ నేతల హామీలు నిలబెట్టుకోవడంలో కాస్త ముందుటాయని చెప్పవచ్చు. అక్కడి తమిళతంబీలు కూడా ఎన్నికల్లో హామీలను నెరవేర్చని నేతలకు తమ ఓటుతో తగిన శాస్ర్తి చేస్తారు. అందుకే అక్కడి నేతలు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చా. తప్పకుండా నెరవేరుస్తారు. మొత్తానికి ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలో భాగంగా లాప్ ట్యాప్ లు ఇవ్వడం, విద్యార్థుల్లో ఆనందాన్ని నింపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more