మేల్ ఎస్కార్ట్ గా చేరాలనుకుంటున్నారా..? అంటే అదేదో బాడీ గార్డు ఉద్యోగం కాదు. మగ వ్యభిచారులు అన్నమాట. అయిగా అది ఉద్యోగం ఏమిటీ అనుకుంటున్నారా..? అని సందేహం వస్తుందా..? కానీ ఇది పచ్చి నిజం. మగ వ్యభిచారుల పేరుతో జరుగుతున్న మోసం..? కొందరు నిరుద్యోగులు దీనికి కూడా సై అంటున్నారు. వారి కోసంమే అద్బుతమైన ప్రకటనలు ఇచ్చి ఈ ఉద్యోగం చేరాలనుకుంటున్నారా.. వెంటనే తమ సంస్థలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బ్యాంకులో డబ్బులు జమ చేయండి. అనంతరం నెలకు ఎంత జీతం అనే విషయాలు వెల్లడిస్తాం’’ అని ఏదైనా సంస్థ మీకు ఈ మెయిల్, ఎస్ఎంఎస్ చేసిందో వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మగ వ్యభిచారుల (మేల్ ఎస్కార్ట్స్) ఉద్యోగాల పేరుతో పలు సంస్థలు నిరుద్యోగులను నిట్టనిలువునా దోచుకుంటున్నాయి.
ఇలాంటి ఓ సంస్థ మోసాన్ని నగర సీసీఎస్ పోలీసులు ఛేదించి నిందితుడ్ని అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కనకబోయిన వరప్రసాద్ (20) కూకట్పల్లిలో స్థిరపడ్డాడు. మగ వ్యభిచారులు కావాలని, ఈమెయిల్స్ ప్రకటనలు జారీ చేశాడు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన కొందరు యువకులు అతడి సెల్ఫోన్ను సంప్రదించారు. ముందుగా పేర్లు నమోదు చేయించుకునేందుకు తన బ్యాంకు అకౌంట్లో రూ.5000 నుంచి రూ.7000 వరకు జమ చేయాలని సూచించాడు. నెల జీతంలో 20 శాతం డబ్బును సంస్థకు చెల్లించాలని షరతు విధించాడు.
ఇందుకు అంగీకరించిన పలువురు నిరుద్యోగులు అతడి అకౌంట్లో డబ్బులు వేశారు. తీరా అతను చెప్పిన తేదీన ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్క్రైమ్ ఏసీపీ బి.అనురాధను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ జి.శంకర్రాజు కేసు దర్యాప్తు చేసి నిందితుడి శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగుల నుంచి ఎనిమిది నెలల్లో సుమారు రూ.2 లక్షల వరకు దండుకున్నాడని విచారణలో తేలింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more