భవిష్యత్తులో తమ జీవితం ఎలా గడుస్తుందోనన్న విషయాలను ముందుగానే తెలుసుకునేందుకు ప్రతిఒక్కరు ఉత్సుకత వ్యక్తం చేస్తారు. అయితే.. ఇందులో మరణతేదీని ముందే తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే.. తమ మృత్యువు ఎప్పుడో తెలుసుకుంటే ఆ సమయంలోకల్లా తమ పనులను ముందుగానే నిర్వర్తించుకోవచ్చు కాబట్టి! ఈ విషయమై కొందరు శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలంగా పరిశోధనలు జరుపుతూనే వున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎడిన్బరో వర్సిటీ శాస్త్రవేత్తలు.. మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి, అవయవాల పనితీరును బట్టి, వాటి వయస్సును తెలిపే ఒక జీవగడియారాన్ని కనుగొన్నారు. అంటే.. ఆ అవయవాలు ఎంతకాలం వరకు పనిచేస్తాయోనన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, సదరు అవయవాల పరిమితకాలాన్ని లెక్కగట్టే ఓ గడియారాన్ని రూపొందించారు. ఈ జీవగడియారంతో మనిషి జీవితకాలాన్ని ముందుగానే అంచనా వేయొచ్చని వారు అంటున్నారు.
అదెలా అంటే.. ఈ జీవ గడియారం వయస్సు, మనిషి వయస్సుకు మధ్య వున్న సంబంధాన్ని బట్టి ఓ నమూనా తయారు చేశారు. 5 వేలమంది వృద్ధల జీవన విధానాన్ని 14 ఏళ్లపాటు గమనించిన అనంతరం వారు ఈ నమూనాను రూపొందించడం జరిగింది. దీని ప్రకారం.. జీవగడియారం వయస్సుతో సమానంగా వున్నవారితో పోలిస్తే.. వ్యక్తి వయస్సు కంటే జీవగడియారం వయస్సు ఎక్కువగా వుంటే.. ఆ వ్యక్తి మరణానికి దగ్గరగా వున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
అలాగే ధూమపానం, మధుమేహం, గుండెజబ్బుల ద్వారా సంభవించే మరణాలను కూడా శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. జీవన విధానం, జన్యు కారకాల్లో ఏది జీవగడియార వయసును ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలియరాలేదని మారియోని అనే శాస్త్రవేత్త తెలిపారు. ఏదైతేనేం.. ఇకనుంచి ప్రతిఒక్కరు ఈ జీవగడియారం నుంచి తమ మృత్యువును ముందుగానే తెలుసుకోవచ్చన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more