అమెరికాలోని రెండు ప్రైవేట్ సంస్థల మధ్య దాఖలైన కేసు వివాదంలో అక్కడి కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలంటూ అమెరికాలోని ఓహియో న్యాయస్థానం ఈమేరకు నోటీసులు జారీచేసినట్లు సమాచారం! అమెరికాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయస్థానం కోరిక వివరాలు ఖచ్చితంగా అంజేయాల్సిందేనని న్యాయశాఖ నిపుణులు స్పష్టం చేయడంతో.. ఆ సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సేకరించడంలో అధికారులు నిమగ్నమైపోయారు. అసలు ఈ వివాదం ఎలా తెరమీదకొచ్చింది తెలుసుకోవాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!
పదేళ్లక్రితం మొదలైన ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎంఆర్) ప్రాజెక్టులో 43.5 కి.మీ. మేర.. అలాగే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో 19.2 కి.మీ. సొరంగం నిర్మించే కాంట్రాక్టు అమెరికాకు చెందిన ద రాబిన్స్ కంపెనీకి అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా రాబిన్స్ కంపెనీకి తానూ సాంకేతిక సహకారం అందించానని పేర్కొంటున్న కృష్ణ శ్రీవాస్తవ అనే వ్యక్తి.. అందుకు తనకు దక్కాల్సిన ఫీజులు ఇంకా ఇవ్వలేదంటూ అతడు ఓహియో కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే.. ఆ ప్రాజెక్టులకు, కృష్ణ శ్రీవాస్తవకు ఎటువంటి సంబంధం లేదని రాబిన్స్ కంపెనీ కోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ.. అందుకు సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. ప్రాజెక్టుల దస్త్రాలను పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన పిటిషన్’లో పేర్కొన్నాడు.
దీంతో ఈ ప్రాజెక్టుల పూర్తి వివరాలను, ఇతరత్ర సమాచారం, సంబంధిత నివేదికలు అందించడమంటూ ఓహియో కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని సేకరించే పనిలో నీటిపారుదలశాఖ అధికారులు తలమునకలయ్యారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more