ముక్కోణపు సిరీస్’లో భాగంగా ఇండియాజట్టు మొదట్లో వరుసగా ఓడిపోవడంతో ఫైనల్లోకి వెళ్లడం చాలా క్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే! ఆసీస్, ఇంగ్లాండ్’తో జరిగే రెండు మ్యాచుల్లోనూ భారత్ ఖచ్చితంగా గెలవాల్సి వుండేది. అయితే.. ఇంతలోనే భారత్ ఆశలపై ఆ వరుణుడు నీళ్లు చల్లేశాడు.
సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇంకా మ్యాచ్ మొదలుకాకముందే పలుమార్లు వర్షం పడింది. అయితే కొద్దిసేపటి తర్వాత తగ్గిపోవడంతో కొన్ని ఓవర్లు కుదించి మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే 44 ఓవర్ల వరకు కుదించి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్లీ వరుణుడు ధ్వజమెత్తాడు. దీంతో ఈ మ్యాచ్’నే రద్దు చేయడం జరిగింది. ఈ దెబ్బతో భారత్ ఫైనల్’కి వెళ్లడం చాలా క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్’లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు బరిలోకి దిగగా.. మొదట వాతావరణం బాగానే వుండేది. అయితే.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. రాయుడి వికెట్ పడిన తర్వాత వర్షం మరోమారు భారీగా కురవడంతో మ్యాచ్’కు అంతరాయం కలిగింది. మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్’ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్ల ఖాతాలో రెండేసి పాయింట్లు చేరాయి.
ఇదిలావుండగా.. భారత్ తన తదుపరి మ్యాచ్’ను జనవరి 30వ తేదీన పెర్త్’లో ఇంగ్లాండ్’తో ఆడాల్సి వుంది. ఈ మ్యాచ్’లో ఇంగ్లాండ్’ను ఓడించి ఇండియా గెలిస్తేనే ఫైనల్’కు చేరుతుంది. లేకపోతే.. తట్టాబుట్టా సర్దుకుని భారత్’కి తిరిగి రావాల్సిందే! ఇకపోతే.. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరిపోయింది. దీంతో ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. మరి.. అందులో ఇండియా గెలుస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more