సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీల ముఖ్యనేతల వారసుల తలరాతలను మార్చివేశాయి. కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల ఫలితాలో భాగంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎనిమిది వార్డులకు జరిగిన పోలింగ్లో నాలుగు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగింట్లో టీఆర్ఎస్-2, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు-2 స్థానాలను కౌవసం చేసుకున్నారు. మొదటి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రతాప్రెడ్డిపై రెబల్ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి 616 ఓట్ల తేడాతో గెలుపొందాడు. రెండవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సాదా కేశవరెడ్డి మాజీ ఎంపీ సర్వే కుమార్తె సుహాసినిపై 2,087 ఓట్ల తేడాతో గెలుపొందారు. మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి అనితా ప్రభాకర్ 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నాల్గొవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ గెలుపొందారు.
కంటోన్మెంట్ ఎన్నికలలో గెలుపుతో తమ వారసులకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని ఆశించిన నేతలు భంగపడ్డారు. ఇటు రాష్ట్ర మాజీ మంత్రి, అటు కేంద్ర మాజీ మంత్రుల వారసుల వైపు ఓటర్లు మొగ్గుచూపలేదు. ఇప్పటి వరకు వెలువరించిన ఫలితాలలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ తనయ సుహాసిని ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ బోర్డులోని రెండో వార్డు నుంచి పోటీ చేసిన సుహాసినిపై టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి సదాకేశవరెడ్డి గెలుపొందారు. సుహాసినిపై 2,087 ఓట్ల ఆదిక్యంతో సదాశివరెడ్డి విజయం సాధించారు.
అటు నాలుగో వార్డులో స్థానిక టిడిపి ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిని ఓటమి పాలయ్యారు. నాల్గొవ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ 530 ఓట్ల తేడాతో లాస్య నందితపై గెలుపొందారు. రెండు పర్యాయాలు వరుసగా ఎంపీగా గెలిచి, కేంద్రంలో మంత్రిగా వ్యవహరించిన సర్వే సత్యానారాయణ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న కూడా 2004, 2009 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దీంతో అప్పట్లో తండ్రులను కలవర పెట్టిన ఓటమిని ఇప్పుడు తనయలను కూడా కలవర పర్చిందని స్థానిక ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more