Pakistani forces targeted 12 indian posts late last night along the forces

india and pakistan war in border, india and pakistan, pakisthani ship in porubandar, pakistan ship in india, pakistan vs india

Pakistani forces targeted 12 Indian posts late last night along the forces, bharath has given answer

పేట్రేగిన పాక్ పైత్యం... బుల్లెట్లతో బదులు చెప్పిన భారత్

Posted: 01/03/2015 12:48 PM IST
Pakistani forces targeted 12 indian posts late last night along the forces

పాకిస్తాన్ మరో సారి దుర్నీతిని ప్రదర్శించింది. ఎన్నిసార్లు మన భారత్ బుద్ధి చెప్పిన తన పైత్యాన్ని మాత్రం వీడటం లేదు. శుక్రవారం రాత్రి సాంబ, కాతువ జిల్లాల్లోని 8 ఔట్ పోస్ట్ లే లక్ష్యంగా పాక్ సైన్యం ఏక పక్షంగా కాల్పులు జరిపింది. పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో ముష్కరులు చొరబాటుకు యత్నిచారు. పాక్ సైన్యం దురగాతాన్ని సరిహద్దు భద్రత దళం సిబ్బంది సమర్థంగా తిప్పి కొట్ట్టారు. బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పాక్ రెంజర్లు మృతి చెందారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై భారత హోం శాఖా సహాయ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాక్ సైన్యం దాడులకు తెగబడుతున్న నేపథ్యం అక్కడ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్ళల్లోంచి ఎవరూ బయటకు రావద్దని, అవసరమైతే బంకర్లలో తల దాచుకోవాలని సూచించారు.

ఇప్పటికే గుజారత్ సముద్ర తీరంలో మరబోటుల ద్వారా మన భూభాగంలో అడుగు పెట్టటానికి ప్రయత్నించిన కొందరు దుండగులు భారత నావికా దళం వెంబడించగానే తమను తామే పెల్చేసుకోవటం తో ఆ దుండగులు అక్కడికక్కడే మరణించారు. దాంతో దేశానికి తీవ్ర ముప్పు తప్పినట్లయ్యింది. ఈ సంఘటన జరిగిన మరు దినమే పాక్ సైన్యం కాల్పులకు తేగాపడటం పలు అనుమానాలకు తావిస్తుంది,. ఏది ఏమైనా పాక్ ఈ దుశ్చర్యలకు పాల్పడటం ద్వారా భారత్ సహనాన్ని పరీక్షిస్తుంది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani forces  indian military  bsf india  

Other Articles