వారు మరి ప్రభుత్వానికి పన్ను కట్టే అతి పెద్ద పన్ను దారులు... వారే మందుబాబులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము లో అక్షరాల 150 కోట్ల మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 31 తో పాటు జనవరి 1 కలిపి మద్యం అమ్మకాలు 150 కోట్లు దాటినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దాంతో అధికారులు అవాక్కయారు. ఆ ఒక్కరోజే మద్యం ఏరులై పారటన్ని చూసి కొన్ని వర్గాలు విస్మయం చెందాయి. రాష్ట్రము లో నెలకు సగటున 700 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. కాని ఒక్క డిసెంబర్ నెలలోనే ౩౦౦ కోట్ల మద్యం వ్యాపారం జరగటం పై పలు వర్గాలు విస్తు పోతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మందు బాబులు డిసెంబర్ 31 రోజే పీకల దాక తాగి ప్రభుత్వానికి పన్ను రూపేణ చెల్లించారు. మందుబాబులు మరి ముఖ్యంగా చల్ల చల్లగా బీర్ లే ఎక్కువగా తాగుతున్నారట మరీ... ఈ బీర్ ల అమ్మకాల నెలకు సగటున 60 కోట్లవరకు ఉంటున్నాయన్నది అంచనా. ఈ మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని మద్యం సిండికేట్లు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మద్యం షాపులు అధికంగా ఉన్నందున ఈ జిల్లాల్లోనే మద్యం స్టాకు ఉంచుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో భారీ అమ్మకాలు జరిగితే, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు జరుగుతాయి. మొత్తానికి మద్యం ఆదాయం ఏపీ ప్రభుత్వానికి బాగానే ‘కిక్కు’ ఇస్తున్నట్లుంది. దీని ద్వారానే అధిక ఆదాయం ప్రభుత్వానికి రావటం గమనార్హం.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more