ఆంధ్రప్రదేశ్ రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లో వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఆ ప్రాంత రైతాంగం గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భమూములు ఇవ్వాల్సిన రైతులు ప్రభుత్వం అమోదించి సీఆర్డీఏ బిల్లులో అస్పష్టత కారణంగా భూములు ఇచ్చేందుకు జంకుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తమ భూములు తీసుకుంటుందన్న ప్రకటనతో వారిలో ఆందోళన తీవ్రమైందన్నారు.
రాజధాని గ్రమాల రైతాంగం ఇళ్లను వదిలి.. పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సుమారు 8 నుంచి 10 మంది దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దుండగులను గుర్తించి కేకలు వేసేలోపే వాళ్లు పారిపోయారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టిస్తున్న ఘటనలపై స్పందించిన రైతాంగం తమ పోలాల్లో ఎక్కడ బీభత్సం చేస్తారోన్న అంధోళనతో విపరీతమైన చలిలోనూ వారు తమ పోలాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేరకొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more