రాజకీయమంటేనే మాటల గారడి. మాటలు నేర్చిన నేతలంతా పోటి పడే ఈ ఆటలో ప్రజలను మెప్పించినవారే విజేతలు. ప్రసంగాలు, మాటలు చెప్పటం, విమర్శలు చేయటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి గురించి. తెలంగాణ కాంగ్రెస్ నేతగా ఉద్యమం సమయంలో హైలైట్ అయిన ఈయన.., ఎవరినైనా విమర్శించగల సత్తా ఉన్న వ్యక్తి. ఈయన తిడుతుంటే అవతలి వ్యక్తులు కూడా తమను ఎలా తిడుతున్నాడు అని ఆసక్తిగా గమనిస్తారు. సాధారణ భాషలో, వ్యంగ్యమైన వాయిస్ తో ప్రతి ప్రతిపక్ష నేతనూ ఈయన మాటలు మర్దనా చేస్తాయి.
తాజాగా పొంగులేటి విమర్శల పొంగు కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యపై పడింది. కేంద్రంలో కీరోల్ ప్లే చేస్తున్న వెంకయ్య తెలుగు ప్రజలకు చెవిలో పువ్వులు బాగానే పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ బిల్లు పాసయినప్పుడు.., వెంకయ్య వల్లే ఇది సాధ్యమైందని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ సారు అసలు సంగతి... బాబుతో కలిసి చేసిన కుట్రలు జనాలకు తెలుసే అని ద్వజమెత్తారు. విభజన చట్టాన్ని ఉపయోగించి ఖమ్మంలో గ్రామాలను ఏపీలో కలిపిన వెంకయ్య నాడు చట్టం ప్రకారం చేసుకుపోతున్నామని చెప్పారు. మరి ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చట్టంలో పేర్కొంటే అదంతా నోటి మాట.., గాలి బాసట అని చెవిలో పువ్వులు పెడుతున్నారు అని విమర్శించారు. తనదైన స్టయిల్ లో బీజపికి భారత్ జూటా పార్టీ అని కొత్త డెఫినెషన్ చెప్పారు.
ఇక అలవాటు ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా విమర్శల అక్షింతలు వేశారు. తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి.., కేసీఆర్ ఏరియల్ సర్వేలు చేస్తున్నారని ద్వజమెత్తారు. విహార యాత్రలు, విహంగ వీక్షణాలు మాని.., భూ ప్రదక్షిణలు, ఢిల్లీ ప్రదక్షిణలు చేయాలని సూచించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అడ్డుకోకపోతే, సీఎంకు మేలుకొలుపు యాత్ర చేస్తామని ఎద్దేవా చేశారు. ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more