'నువ్వు గొర్రెను తింటే, నేను బర్రెను తింటా' అన్నట్టు ఉంది సాక్షి, ఈనాడు పత్రికల వ్యవహారం. అవును మరీ.., ప్రజలిప్పుడు ఈ రెండు పత్రికల గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవల జగన్ ఆస్తులను ఈ.డీ అటాచ్ చేసినప్పుడు అది ఒక వార్త లాగ ప్రచురించింది ఈనాడు. అంతవరకు సరే అంతా బానే ఉంది. అదొక ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం అనుకుందాం. ఆ వార్తపై సాక్షి ప్రతిస్పందిస్తూ 'జగన్ ఆస్తుల ఈ.డీ అటాచ్ గురించి..... దానికో పెద్ద వార్త ప్రచురించిందని ఇంకే వేరే వార్తలే, లేనట్లుగా మా సంస్థలు మూసివేయబడతాయి అన్నట్లుగా ఈనాడు ప్రచురించిందని ఆరోపించింది. సాక్షి లో ఇచ్చిన ప్రకారంగా.... 'మా ఆస్తులు కేవలం ఈ.డీ అటాచ్ చేయటం అంటే వాళ్ళ ఆధీనం లోకి తీసుకోవటం కాదని కేవలం దానిలో క్రయ విక్రయాలు జరపకుండా ఉండటం మాత్రమే అని, రోజు వారి కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని కనుక ఎవరు కూడా ఈనాడు కథనానికి ఆందోళన చెందవద్దని తన పత్రికలో అచ్చేసుకుంది. ఇంతటితో మల్లి విషయం అయిపోయిందా అంటే అదీ లేదు మల్లి ఈ.డీ అన్ని ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందంటూ ఈ నాడు లో వార్త రాగానే సాక్షి దానికి మరొక సమాధానం ఇచ్చింది.
విషయం ఏంటంటే అసలు వీళ్ళు పత్రికలు పెట్టింది ప్రజలకు సమాచారం అందించటం కోసమా లేక వీరికి వీరే ప్రశ్నలకు ప్రశ్నలు.., సమాధానాలకు ప్రతి సమాధానాలు ఇచ్చుకోవటం కోసమా? అని ప్రజలు గొణుక్కుంటున్నారు.. పత్రికలు ఉన్నది ప్రజా సమస్యలను ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటటం కోసం, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం కోసం.., కానీ ఈ పత్రికలు ఒకరినొకరిపై వాగ్భాణాలు వేసుకోవటం తోనే సమయాన్ని, పత్రికలోని విలువైన స్థలాన్ని వృధా చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతం లోనూ వీరు ఇలానే వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ పత్రిక ప్రశ్న వేస్తే.., ఈ పత్రిక సమాధానం ఇవ్వటం, ఈ పత్రిక ప్రశ్న వేస్తే.., ఆ పత్రిక సమాధానం ఇవ్వటం.. ఇలా... పొద్దునే ప్రశాంతంగా ప్రపంచంలో జరిగే వార్త విశేషాల తెలుసుకుందామని పత్రిక తీస్తే వీళ్ళ సొంత పైత్య వార్తల హడావుడితో వాటిని చూడలేకపోతున్నారని, వెంటనే పక్కకి తిప్పేసి చదవకుండా ఉండటమే మేలని ప్రజలు వాపోతున్నారట. ఏది ఏమైనా ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల విజ్ఞానానికి తోడ్పాడాల్సిన పత్రికలు ఇలా ఒకరినొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పత్రికలోని విలువైన స్థలాన్ని, ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయటం సరి కాదని వార్తలను వార్తలాగ ఇస్తే సరిపోతుందని మేధావులు చర్చించుకుంటున్నారు.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more