పాకిస్థాన్ చరిత్రలో చెరగని చేదు జ్ఞాపకంగా ముద్రపడిన పెషావర్ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని దేశాలు ఉగ్రవాద దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. తాలిబన్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు, అమాయక విద్యార్థులను పొట్టనబెట్టుకోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ దేశాలను విషాదంలోకి నెట్టేసిన ఈ దుర్గటనకు కారకుడు రేడియో ముల్లా అలియాస్ ముల్లా ఫజులుల్లా. నరరూప రాక్షసుడిగా మారి పిల్లలను చంపడానికి తాలీబన్ చీఫ్ హోదాలో ఆదేశాలిచ్చిందితడే.
ఫజులుల్లా చరిత్ర తిరగతోడితే అంతా ఉగ్రవాదమయంగానే ఉంది. స్వాత్ ప్రాంతంలో చదువుకుని పెద్దయిన ఈ ఉగ్రవాది ప్రశాంతతకు మారుపేరైన ఆ ప్రాంతాన్ని నెత్తుడి కూడలిగా చేశాడు. 2001లో అమెరికాకు చెందిన నాటో దళాలు ఆఫ్ఘన్ లోకి ప్రవేశిస్తే వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు వెళ్ళిన వేల మందిలో ఫజులుల్లా కూడా ఒకడు. ఆ తర్వాత పాక్ కు తిరిగి వస్తుంటే పోలిసులు అరెస్టు చేయగా., బెయిల్ పై విడుదల అయ్యాడు. తెహ్రిక్ నిఫాజి షరియత్ ఇ మహ్మది అనే సంస్థలో కీలకంగా పనిచేశాడు. ఓ రేడియో స్టేషన్ స్థాపించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు. అలా రేడియో ముల్లాగా కూడా ఫజులుల్లా అందరికి సుపరిచితుడు. ఫజులుల్లా వెళ్లఆక స్వాత్ లోయలోని మింగోరా ప్రాంతం నిత్యం దాడులతో వణికిపోయేది. అలా ప్రశాంత ప్రాంతం రక్తపు కూడలిగా మారింది.
షరియత్ సిద్దాంతాల అమలు కోసం ఏ దారుణానికైనా తెగబడే తత్వం కలవాడు. 2013లో అమెరికా డ్రోన్ దాడులు అప్పటి తాలిబన్ చీఫ్ హకీముల్లాను మట్టుబెట్టగా ఫజులుల్లా బాధ్యతలు చేపట్టాడు. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా చాలాచోట్ల దాడులు జరిపి ప్రతాపం చూపాడు. ఉగ్రవాద నేతపై ఐదు లక్షల డాలర్ల రివార్డు కూడా ఉంది. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న మలాలాపై దాడిలోనూ కీలకంగా వ్యహరించాడు. ఇలా జీవితమంతా నెత్తుటిమయంగా బతుకుతున్న ఫజులుల్లా సైనికుల ధైర్యాన్ని దెబ్బకొట్టే ఉద్దేశ్యంతో సైనిక పాఠశాలపై దాడికి వ్యూహరచన చేసి. వందల సంఖ్యలో కుటుంబాలకు విషాధాన్ని మిగిల్చాడు. పవిత్ర యుద్ధం ముసుగులో రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న రేడియో ముల్లాను అంతమొందిచాలని ప్రపంచ దేశాల ప్రజలు కోరుతున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more