ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ లో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ నాలుగు నెలల క్రితం తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుండి దాదాపు నాలుగు నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సకు కూడా ఆయన అంతగా స్పందించటం లేదని, ఆయన ఆరోగ్యం అలాగే ఉందని, ఏ మాత్రం కూడా మారలేదని ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ప్రతిరోజూ వైద్యుల బృందం ప్రతిరోజూ ఎప్పటికపుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉందన్నారు. న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు ఆయనను చూస్తున్నారని, జశ్వంత్ ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్.. ఆగస్టు 8వ తేదీన తమ ఇంట్లో స్పృహలేని పరిస్థితిలో నేలమీద పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.
వాజ్ పేయి హాయంలోని ఆయన క్యాబినెట్ లో పని చేసిన ఈ వృద్ధ నేత పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. భా జ పా లో కీలక నాయకుడిగా ఉన్న తరుణంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. తను స్వయంగా రాసిన "జిన్నా: భారత దేశ విభజన-స్వాతంత్రం" అనే పుస్తకం లో జిన్నా అలీ ని పొగిడి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారాన్ని సృష్టించారు. తన రాజకీయ జీవిత చరమాంకంలో.., ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో బర్మేర్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. అసంతృప్తి తో భా జ పా నుండి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాని ఘోర పరాజయాన్ని చవి చూసారు. భా జ పా నుండి బయటకి వచ్చినప్పుడు పార్టీ ఆరు సంవత్సరాల బహిష్కరణ వేటు వేసింది. ఆ సమయం నుండి రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉంటూ వచ్చారు.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more