Telangana speaker serves notices to 3 tdp mlas

telangana, telangana assembly news, telanagna assembly, tdp, trs party, budget meetings, kcr, mla, telanagan mla, assembly speaker

Telangana Assembly Speaker M Madhusudana Chary on Monday served notices to the defected three Telugu Desam legislators

పార్టీ కండువా మార్చిన ఎం ఎల్ ఏ లకు తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Posted: 12/09/2014 02:59 PM IST
Telangana speaker serves notices to 3 tdp mlas

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణ లతో ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎం ఎల్ ఏ లకు తెలంగాణ అస్సెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి గారు నోటీసు లు జారి చేశారు. ఇదివరకే నలుగురు శాసన సభ్యులకు ఫిరాయింపుల నోటీసు లు అందజేసారు.. ఈ మొత్తం సంఖ్య ఏడు కి చేరింది. తాజాగా నోటీసు లు అందుకున్న వారిలో తలసాని  శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), తీగల కృష్ణా రెడ్డి  (మహేశ్వరం ), చల్ల ధర్మా రెడ్డి  (పరకాల) ఉన్నారు. వీరు ఇటీవలే కెసిఆర్ సమక్షం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ  తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌కు వలస వెళ్లిన రెడ్యానాయక్ (డోర్నకల్), విఠల్‌రెడ్డి (ముధోల్), కె.కనకయ్య (ఇల్లెందు) ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (వైరా)కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

వీళ్ళే కాక ఇంకా మరి కొందరు ఎం ఎల్ ఏ లు టి ఆర్ ఎస్  పార్టీ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. కాని వెంట వెంటనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే పార్టీలో అంతర్గతంగా తలెత్తే అసంతృప్తి, బయటనుంచి వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా వలసలను నిలుపు చేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెపుతున్నాయి. ఇపుడే చేర్చుకుంటే ఆ నియోజక వర్గ భాద్యులుగా ఉన్న టి ఆర్ ఎస్ నేతల్లో అసంతృప్తి భగ్గు మంటుందన్న  యోచన తోనే ఆ నేతలకు ఇప్పుడప్పుడే  వద్దని  సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం స్పీకర్ ఇచ్చిన ఈ తాకీదులపై  ఎం.ఎల్.ఏ లు ఎం జవాబు ఇస్తారో చూడాలి మరి...!!

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly speaker  tdp  mla  trs  kcr  

Other Articles