మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక పాతికేళ్ల మైత్రి బంధాన్ని కూడా మరచి విడిపోయిన సైద్ధాంతిక సోదర పార్టీలు మళ్లీ కలిశాయి. అధికారం కోసం ఎట్టకేలకు బీజేపి, శివసేనలు కలిశాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరేందుకు రంగం సిద్ధకావడంతో శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ను విస్తరించారు. రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావు 10 మంది ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా మొత్తం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకరాం చేయగా, వారిలో శివసేనకు చెందిన ఐదుగురు సభ్యలతో పాటు బీజేపికి చెందిన ఐదుగురు సభ్యులున్నారు. మహారాష్ట్రలో శివసేన అధికారాన్ని పంచుకోవడంతో మైనారిటీలో వున్న ప్రభుత్వం కాస్తా మెజారీటీలోకి చేరింది. మొత్తం 287 సబ్యులున్న మహారాష్ట్ర బీజేపిలో ప్రభుత్వ బలం 184కు చేరింది. శివసేన అధికారాన్ని పంచుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇరు పార్టీల నేతలతో కూడిన కో అర్ఢినేషన్ కమిటీని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఇరు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుని పాలన సాదించాలని నిర్ణయించుకున్నాయి,
త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇరు పార్టీలో పక్కా ముందస్తు ప్రణాళికలు, వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి. ప్రజలకు సుస్థిరమైన పాలనను అందించేందుకు పాత మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారని శివసేన నేత సుబాష్ దేశాయ్ అన్నారు. అయితే ఉపముఖ్యమంత్రి పదవిపై కోనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు బీజేపి తెరదించింది. కాగా, ఈ నెల 8 నుంచి నిర్వహించినున్న మహారాష్ట్ర శీతాకాల సమావేశాల్లో.. ప్రతిపక్ష హోదా లేకుండానే కొనసాగనుందని వార్తలు వస్తున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more