తమ సిద్ధాంతాలు, రాద్దాంతాలతో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు, ప్రపంచాన్ని నాశనం చేసేందుకు రోజుకో కొత్త వ్యూహం రచిస్తున్నారు. టెక్నాలజి, తెలివిని అందిపుచ్చుకుంటూ రోజుకో విధంగా దాడులు చేసేందుకు పన్నాగాలు రచిస్తున్నారు. ఆత్మాహుతి దాడులతో ప్రాణాలు పోయినా సరే ఇతరులు చావాలనే క్రూరమైన ఆలోచనను అమలు చేసే తీవ్రవాదులు తాజాగా మరో కొత్త కుట్రకు తెరతీసినట్లు ఆఫ్ఘన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రత్యేకమైన జాతుల పక్షులను ఎంపిక చేసుకుని, వాటికి చిన్ననాటి నుంచే ఉగ్రశిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. బాంబులను మోసుకెళ్లటం, లక్ష్యాల దగ్గరకు చేరుకోవటం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు.
ఆఫ్ఘన్ పోలిసులు తుర్కమెనిస్థాన్ సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టగా.., ఎప్పుడూ కన్పించని కొత్త పక్షి కన్పించింది. దీన్ని మరింత తీక్షణంగా పరిశీలించగా.., దానికి కొన్ని వైర్లు ఉన్నట్లు కన్పించాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం పక్షిని కాల్చి చంపింది. ఆ తర్వాత పక్షిని పరిశీలిస్తే.., దానికి పేలుడు పధార్థాలతో కూడిన సంచి, డిటోనేటర్, జీపీఎస్ ట్రాకర్ తో పాటు, కెమెరా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రత్యేక జాకెట్ కూడా వేసుకున్నట్లు గుర్తించి సైనికాధికారులు షాక్ అయ్యారు. సైనికుల దగ్గరకు వెళ్లగానే పేల్చేసేలా పక్షిని గైడ్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఉగ్రవాదులు, ఆత్మాహుతి దళాలు సాధారణ ప్రజల దగ్గరకు వెళ్లి దాడులు చేయగలిగినా.. పోలిసులు, సైనికులపై సులువుగా దాడి చేయలేవు. దీంతో పక్షులను ఎంపికచేసుకుని వాటిని ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతానికి ఈ కుట్ర ఆఫ్ఘన్ లో తాలిబన్లకే పరిమితం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్ర శిక్షణను ఇతర సంస్థలు కూడా చేపడితే.. పక్షులు సమీపంలోకి వచ్చినా పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడటం ఖాయం. సో కొత్త పక్షులు వస్తున్నాయంటే దగ్గరగా వెళ్లి చూడకుండా.., కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం ఉత్తమం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more