వివాదాస్పద గురూజీ బాబా రాంపాల్ ను పట్టుకునేందుకు పోలీసులు సాగించిన ఆపరేషన్ కు 26 కోట్ల రూపాయాల పైచిలుకు వెచ్చించారు. హర్యానాలోని హస్సార్ పట్టణానికి చేరువలో వున్న బర్వాల గ్రామంలోని సత్ లోక్ ఆశ్రమంలో దాగివున్న బాబా రాంపాల్ ను అరెస్టు చేయడానికి, పక్షం రోజుల పాటు సాగించిన ఆపరేషన్ కు 26 కోట్ల రూపాయలను ఖర్చ చేశారని పంజాబ్ హ్యారానా హైకోర్టు వెల్లడించింది. పారా మిలటరీ బలగాల సాయంతో ఎట్టకేలకు రాంపాల్ ను పట్టుకోగలిగామని హర్యానా డీజీపీ ఎస్ ఎన్ వశిష్ట్ కోర్టుకు నివేదికను సమర్పించారు.
హర్యానా, పంజాబ్ పోలీసులతో పాటు చండీగడ్ పాలనాయంత్రాగం, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాంపాల్ ను పట్టుకోవడంలో తమకు వ్యయమైన మొత్తాన్ని నివేదిక రూపంలో కోర్టు సమర్పించాయి. రాంపాల్ భాబాను పట్టుకునేందుకు హ్యరానా ప్రభుత్వానికి 15.43 కోట్ల రూపాయల వ్యయం కాగా, పంజాబ్ ప్రభుత్వానికి 4 కోట్ల 34 లక్షల రూపాయలు వ్యయమయ్యాయి. చండీగఢ్ పరిపాలనా యంత్రాగానికి 3 కోట్ల 28 లక్ష్లల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్ల 55 లక్షల రూపాయల వ్యయం అయ్యిందని కోర్టుకు సమర్పించిన నివేదికలలో వెల్లడించాయి
రాంపాల్ తన అనుచరుల సాయంతో పోలీసులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటంతో ఐదుగురు మృతి చెందారని వారిలో నలుగురు మహిళలు కాగా, మరోకరు చిన్నారి బాలుడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరితో పాటు పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయాని తెలిపారు. దీంతో అతన్ని పట్టుకోవడానికి పోలీసు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో వెళ్లాయని, అందుచేత 26 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని వారు సమర్పించిర నివేదికలో పొందుపర్చారు. రాంపాల్ ను అరెస్టు చేసే క్రమంలో సుమారు 15 వేల మంది బాబా సాయుధ అనుచరులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఆపరేషన్ సందర్భంగా సుమారు 200 మంది క్షతగాత్రులయ్యారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
ఇవాళ కట్టుదిట్టమైన భద్రత నడుమ రాంపాల్ ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ వచ్చే నెల (డిసెంబర్) 23కు వాయిదా వేసింది. డిసెంబర్ 23న బాబా రాంపాల్ తో పాటుగా ఈ కేసులో నిందులుగా వున్న రాంపాల్ ఢాకా, ఓపీ హూడాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని పంజాబ్ హర్యానా హైకోర్టు పోలీసులను అదేశించింది. ఈ ఆపరేషన్ లో గాయపడిన పోలీసు వైద్య నివేదికలను కూడా తమకు పమర్పించాలని న్యాయస్థానం దిసభ్య ధర్మాసనం పోలీసులను అదేశించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more