యాహూ నుంచి ప్రారంభమైన చాటింగ్ ఇప్పడు రమారమి ఇప్పడు అన్ని సోషల్ నెట్ వర్క్ సైట్లు లబ్దిదారులకు అందజేస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సప్లకు పోటీగా ఇప్పడు వైబర్ కూడా చాటింగ్ అవకాశాన్ని కల్పించనుంది. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇన్నాళ్లూ ఉచితంగా కాల్స్ మాత్రమే అందిస్తున్న వైబర్.. ఇప్పుడు పబ్లిక్ చాట్ను కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ హార్డీ చెప్పారు. భారతదేశంలో తమకు అత్యధిక సంఖ్యలో వినియోగదారులు వున్నారని, మొత్తం 46 కోట్ల మంది యూజర్లుంటే, వాళ్లలో 3.3 కోట్లమంది భారతీయులేనని, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, రష్యా, బ్రెజిల్, యూకే దేశాల వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు. భారత్ విఫణిలో తము అగ్రస్థానంలో కొనసాగుతున్న దరిమిలా వినియోగదారుల అందుబాటులోకి ఉచిత చాటింగ్ ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు.
పబ్లిక్ చాటింగ్ ద్వారా కేవలం చాటింగ్ చేసుకోవడమే కాక, కంటెంట్ కూడా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, తాము ఫాలో అయ్యే సెలబ్రిటీల చాట్లు, వాళ్ల చర్చలను కూడా యూజర్లు చూసుకోవచ్చునన్నారు. అంతేకాదు.. ఇందులో మరో కొత్త అవకాశం కూడా ఉంది. లైవ్ సంభాషణలు జరుగుతున్నప్పుడు వాటిని అప్పటికప్పుడే చూసుకునే వీలు కల్పించారట. వైబర్ వాడేవాళ్లు ఎంతమందిని ఫాలో అవుతుంటే అంతమంది చాట్లు చూడచ్చు. ఇందులో టెక్స్ట్, ఫొటోలు, ఆడియో, వీడియో, వెబ్ లింకులు ఏవైనా షేర్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఏడాదికి 130 శాతం పెరుగుదల ఉంటోందని, ప్రతివారం తమకు అదనంగా 10 లక్షల మంది యూజర్లు కలుస్తున్నారని మార్క్ హార్డీ తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more