అవినీతి రహిత సమాజం కోసం అంటూ మంచి ట్యాగ్ లైన్ తో సమాజ హితాన్ని కోరుకుంటూ సత్యాన్వేషణ, అవినీతి, అక్రమాల అన్వేషణ సాగిస్తున్న వార్తా స్రవంతి.. టీవీ 9కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో గత వంద రోజులకు పైగా ప్రసారాలు నిలిచిపోయిన తరువాత.. ఇటీవలే ప్రసారాలు పున: ప్రారంభమయ్యాయి. తాజాగా.. కర్ణాటకలో టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయి. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిందని అరోపణలు వినబడుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి కర్ణాటకలో టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయని సమాచారం.
అయితే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని టీవీ 9 కర్ణాటక వెలుగులోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలను చేసింది. సరిగ్గా సోమవారం రాత్రి 9.30 గంటలకు వాటిని ప్రసారం చేస్తారని కూడా ప్రకటనలు వెలువరించింది. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సరిగ్గా తొమ్మిది గంటల నుంచి టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే కర్ణాటక మంత్రి శివకుమార్ అదేశాల మేరకే ప్రసారాలు నిలిచిపోయినట్లు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్దరామాయ్య కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా, ఈ వివాదాస్పద అంశంపై సీఎం మాట్లేడేందుకు నిరాకరించారు.
కాగా, కర్ణాటక రాష్ట్ర కేబుల్ అపరేటర్ల సంఘం అధ్యక్షడు పాట్రిక్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. టీవీ9 న్యూస్ చానల్ ప్రసారాల నిలిపివేత వెనుక ప్రభుత్వ హస్తం వుందన్న వార్తలను కొట్టిపారేశారు. టీవీ 9లో ఎక్కువగా తెలుగు సినిమాల గురించే ప్రసారాలు చేస్తున్నారని, కేవలం తెలుగు మాట్లాడే వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. కర్ణాటక ప్రజలకు టీవీ 9 న్యూస్ ఛానల్ తో అవసరం లేదన్నారు. కేబుల్ అపరేటర్లపై కూడా వ్యతిరేక కథనాలను టీవీ 9 ప్రసారం చేస్తుందని అయన తన అక్కస్సును వెల్లగక్కారు.
భారత రాజ్యాంగంలో నాలుగో స్థంభంగా అభివర్ణించబడిన మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతూనే వున్నాయన్నడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలను ప్రసారం చేసే అన్ని ఛాన్సెల్స్ పై కేబుల్ అపరేటర్లను వారధిగా పెట్టుకుని ప్రభుత్వ అజమాయిషి నడిపిస్తోందన్న విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ కుంభకోణాలను వెలుగులోకి రానీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తప్పులు చేయడం.. వాటిని ఎత్తిచూపుతున్న మీడియాను కట్టడి చేయడం పాలకులకు అలవాటుగా మారుతోందన్న విమర్శలు వినబడతున్నాయి. మీడియా స్వేచ్ఛపై ప్రసంగాలు గుప్పించే నాయకులు.. ఈ తరహా నియంత్రణపై ఏలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more