బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అయిన అర్పితఖాన్ వివాహ వేడుకలు మంగళవారం హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే! ఈ వివాహవేడుకలకు ఎంతోమంది వ్యాపారదిగ్గజాలు, సినీప్రముఖులందరూ పాల్గొన్నారు. ఇక నిన్నమొన్నటివరకు కస్సుబుస్సులాడుకున్న షారుఖ్, సల్మాన్ లు ఈ వేడుకల సందర్భంగా కలుసుకుని, సందడి చేశారు. అంతాబాగానే వుంది కానీ... ఈ పెళ్లిలో ఒక ఆసక్తికరమైన విషయం వుంది. అదేమిటంటే.. అర్పిత అసలు సల్మాన్ ఖాన్ సోదరియే కాదు. కొన్ని విషాదకరమైన పరిస్థితుల్లో గడుపుతున్న నేపథ్యంలో దేవుడు కరుణించడంతో సల్మాన్ కుటుంబంలో చేరిపోయింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
అర్పిత చిన్నపిల్లగా వున్న కాలంలో ఆమె తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. తల్లి మరణించిన దు:ఖంలో మునిగిపోయిన అర్పిత, ఒకనాడు రోడ్డుపై దీనంగా కనిపించింది. ఆ అమ్మాయిని అటువంటి పరిస్థితుల్లో చూసిన సల్మాన్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సలీంఖాన్ చలించిపోయారు. మరేమీ ఆలోచించకుండా ఆమెను ఇంటికి తీసుకువచ్చి దత్తత చేసుకున్నారు. ఎంతో ముద్దుగా వున్న అర్పితను కన్నబిడ్డకంటే ఎక్కువ మిన్నగా చూసుకున్నారు సలీంఖాన్ దంపతులు. అలాగే వాళ్ల కుమారులు సల్మాన్, అర్బాజ్, సోహేల్ ఖాన్ లు కూడా అర్పితపై విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నారు. ఆ అమ్మాయి కోరిన అన్ని కోరికలను తీర్చడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు సల్మాన్ సోదరులు. అందుకు ప్రస్తుతం జరిగిన వివాహ వేడుకలే ఉదాహరణగా తీసుకోవచ్చు.
తన మనసుకు నచ్చినవాడితో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించడం చూస్తుంటే అర్పితపై వారికెంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతున్న పెళ్లి వేడుక ఖర్చు రూ.2 కోట్లు కాగా, బంగారు చెల్లికి సల్మాన్ ముంబయి కార్టర్ రోడ్డులో రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ బహుమతిగా కూడా ఇచ్చాడు. అర్పిత అదృష్టం అనడం కంటే, ఇదంతా సల్మాన్ కుటుంబం గొప్పదనంగానే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more
Aug 16 | రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది.... Read more