ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరుకు సిద్ధమైన నేపథ్యంలో బ్రిటన్ కు రానురాను ముప్పు మరింతగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో రెండో అత్యంత ప్రమాదకర హెచ్చరికను ఆగస్టులో బ్రిటన్ జారీచేసింది. ఇక అప్పటినుంచి బ్రిటన్ అధికారులు ప్రతిక్షణం అలర్ట్ గా వుంటున్నారు. బాంబుదడులు జరగకుండా వుండేందుకు అన్నిచోట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతసెక్యూరిటీ వున్నా కూడా... బ్రిటీష్ పార్లమెంటు ఆవరణలో అధికారులకు ఓ అనుమానాస్పద ఐప్యాడ్ బాంబు కనిపించడంతో అందరూ షాకయ్యారు. అంతే.. పార్లమెంటులో వున్న అధికారులందరూ ఒకటే పరుగులు తీశారు.
పార్లమెంటు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతాధికారులు రంగంలోకి దిగి ముందు జాగ్రత్తగా ఎంపీలను పార్లమెంట్ నుంచి వెలుపలకు పంపించారు. అంతేకాదు.. పార్లమెంట్ ఎదురుగా ఉన్న ఆఫీసు బిల్డింగ్, వెస్ట్ మినిస్టర్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ను కూడా ఖాళీ చేయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతాధికారులు అణువణువు సోదా చేసిన అనంతరం అసలు విషయం బయటపడింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ వస్తువు బాంబు కాదని.. అది కేవలం ఐప్యాడ్ మాత్రమేనని నిర్ధారణకు వచ్చిన అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఐపాడ్ మంత్రి నిక్ బోల్స్ అనుచరుడిదిగా గుర్తించారు.
మంత్రి నిక్ బోల్స్ అనుచరుడు పార్లమెంటుకు రావడం అదే మొదటిసారట! తను వస్తూ తనతోపాటు ఆ ఐప్యాడ్ ను కూడా పార్లమెంటుకు తీసుకెళ్లాడు. మరి అతను అక్కడే మరిచిపోయాడే లేక లోపలికి తీసుకెళ్లడానికి అధికారులు తిరస్కరించారో తెలియదు కానీ.. ఆ ఐప్యాడ్ ను అతను ప్రాంగణంలోనే వదిలివెళ్లాడు. అంతే! దానిని గమనించిన అధికారులు అది బాంబు అనుకుని ప్రాణభయంతో అడ్రస్ లేకుండా పరుగులు తీశారు. చివరికి కాదని తెలిసి రిలీఫ్ అయ్యారు. దీనిపై మంత్రి నిక్ బోల్స్ ట్వీట్ చేస్తూ.. ‘‘మా కుర్రాడి ఉద్యోగం పార్లమెంటులో తొలినాడే ఉద్విగ్నభరితంగా మొదలైంది. అతడి ఐపాడ్ కారణంగా పార్లమెంటు మొత్తం ఖాళీ అయింది’’ అని పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more