బ్యాంకులకు బకాయిపడినట్లు వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి అనుమానాలు వున్నా వాటిని సదరు కంపెనీ ప్రతినిధుల వద్దకు నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. నగరంలోని సీసీఎంబీ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని... మొక్కలు నాటారు. అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం మరింత ప్రగతి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పదవి చేపట్టిన సుజనా చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన మీడియా.. ఆ తదనంతరం ఆయనపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై వివరణ కోరింది. దీనిపై స్పందించిన సుజానా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోచ్చారు. అదే సమయంలో అక్కడే వున్న బాపట్ల టీడీపీ ఎంపీ మల్యాద్రి మాత్రం అసహనానికి గురైయ్యారు. కేంద్రమంత్రిగారినే ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. మీరెవరు..? ఏ పత్రిక నుంచి వచ్చారు? ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారంటూ విలేకర్లపై బెదిరింపు ధోరణితో వ్యవహారించారు. మాల్యాద్రి తీరుపై విలేకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద కోల్పోవద్దంటూ మాల్యాద్రికి హితవు పలికారు.
అయినా కేంద్రమంత్రి పదవి చేపట్టేవరకు ఆయనకు లేదా పలుకుబడి వున్న వర్గాలకు మాత్రమే తెలిసిన అప్పుల బాగోతం.. ఇప్పడందరికీ తెలసింది. దేశ ప్రజలందరూ ఈ విషయమై మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోడీ క్యాబినెట్లో.. సుజనా చౌదరి అనే మంత్రి భారతీయ పబ్లిక్ సెక్డార్ బ్యాంకులకు 315 కోట్ల రూపాయలు, విదేశీ బ్యాంకులకు మరో 107 కోట్ల రూపాయాల వరకు బాకీ పడ్డాడని చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రి పదవి రావడంతో ఐదేళ్ల పాటు ఉపశమనం పొందడానికే చంద్రబాబు వెంట పడి పదవి తీసుకున్నాడని కూడా చర్చించుకుంటున్నారు. ఉన్నమాటంటే ఉలికెందుకని.. వారందరిపైనా కోపడతారా.. ఎంపీ గారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more