బెంగళూరులో దారుణం జరిగింది. దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో ఏర్పడ్డ దొంగల ముఠా ఆ చిత్రం తరహాలోనే నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం భర్త, అత్త, కుమారుడి కళ్లముందే ఆ గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో రికార్డ్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము రికార్డ్ చేసిన వాటిని ఇంటర్నెట్లో పెట్టి పరువు తీస్తామని బెదిరించి పారిపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పడు బెంగళూరులోని తీవ్ర చర్చకు కారణమవుతోంది. తమ ఇళ్లల్లో కూడా భద్రత కరువవ్వడంపై గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని ఇగ్గలూరులోని గ్రీన్గ్రేన్ లేఔట్లో ఓ వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అక్టోబర్ 24వ తేదీ రాత్రి 11.45 గంటల సమయంలో నలుగురు నిందితులు అతని ఇంటికి వచ్చారు. తాము పోలీసులమని చెప్పడంతో ఆ వ్యక్తి తలుపులు తీశాడు. ఇంటిలోకి వెళ్లిన వారు ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు. బీరువాలో ఉన్న రూ. 10 వేలు, రూ. లక్ష విలువైన బంగారు నగలు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా యజమాని భార్య చీరను లాగేశారు. అదే చీరతో ఆ వ్యక్తిని, అతని తల్లిని, అతని కుమారుడిని మంచానికి కట్టేశారు. తరువాత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే అత్యాచారం చేసిన దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్కుమార్ తెలిపారు. అయితే తమ ఇంట్లో జరిగిన విషయాన్ని గుట్టుగానే వుంచిన కుటుంభసభ్యులు.. పోలీసులకు సైతం పిర్యాదు చేయలేదట.
నాలుగు రోజుల తరువాత పరువు పోతుందని భయపడిన ఆ ఇంటి యజమాని తమ ఇంటిలో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత నేరస్తుల ఫొటోలను ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు చూపించారు. ఓ నిందితుడ్ని ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ నిందితుడి ఆధారంగా మిగిలిన వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నందీష్, అతని అనుచరులు అనీల్ కుమార్, సుజిత్ కుమార్ అలియాస్ సుజిత్, సెమైన్గా గుర్తించారు. నందీష్ పాత నేరస్తుడని, అతనిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని అలోక్ కుమార్ చెప్పారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more