కోడిగుడ్డు ఒకటెంత 15 రూపాయలు. మరి డజను 180 అదేంటి డజను తీసుకున్నా తక్కువకు ఇవ్వవా.. ఇలా బేరంసారాలు సాగుతున్నవి ఎక్కడో కాదు.. హుద్ హుద్ తుపాను పెను బీభత్సాన్ని సృష్టించిన విశాఖలో. అదేంటి ఒక్క గుడ్డు రూ.15 నా..? అనుకుంటున్నారా..? పాలు లీటర్ రూ. 80, పెట్రోల్ లీటర్ రూ. 150, టమాటో కిలో రూ. 80 ... ఇవి ప్రస్తుతం విశాఖపట్నంలో నిత్యవసర ధరల రేట్లు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం నగరంతోపాటు మిగిలిన జిల్లాల్లో నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి.
హుదూద్ తుపాన్తో అతలాకుతలమైన సామాన్యుడు... ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలతో విలవిల్లాడిపోతున్నాడు. ప్రజల నుంచి డబ్బులు దండుకునే సమయం ఇదేనంటూ అమ్మకందార్లు రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి సామాన్యుడిలో నెలకొంది. నిత్యవసర ధరలు కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద భారీగా ప్రజలు క్యూలో నిలబడ్డారు. అలాగే పెట్రోల్ బంకులు వాహానదారులతో కిక్కిరిపోయాయి.
తుపాను రాకూడదని లక్షల మంది అటు సముద్రుడిని, ఇటు ధేవుళ్లను ప్రార్థిస్తుంటారు. కానీ తుపాన్లు రావాలని, వచ్చినప్పుడే అధిక ధరలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవచ్చని అమ్మకందార్లు కోరుతానడంలో అతిశయోక్తి లేదు. పైగా అమ్మకం దార్ల ప్రార్థనలే దేవుడు కూడా అలకించడం, సామాన్యుల బతుకులను ఛిద్రం చేస్తున్నాడు. మరోవైపు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా మున్సిపల్ పంపుల్లో నీరు రాకపోవడంతో నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more