32died in bihar stampade

bihar, patna, bihar stampade, patna stampade, vijayadashami, vijayadashami special, vijayadashami in india, vijayadashami celebrations, vijayadashami updates, vijayadashami in andhrapradesh, dasara in india, dasara celebrations, dasara speciality, mysore dasara, mysore dasara celebrations, latest news, accident, panic incidents

bihar in very sad today as 32people of the state died in a stampade in patna gandhi ground : in bihar capital patna ravan dahan programme performed and 32people died so many injured in the stampade

బీహార్ తొక్కిసలాటలో 32మంది దుర్మరణం

Posted: 10/04/2014 07:33 AM IST
32died in bihar stampade

సరదాల దసరా పండగ బీహార్ కు విషాదాన్ని మిగిల్చింది. కన్నులపండువగా సాగిన ఉత్సవాలు చివరిసమయంలో కన్నీళ్ళను తెప్పించాయి. బీహరా్ రాజధాని పాట్నాలో జరిగిన తొక్కిసలాటలో 32మంది దుర్మరణం చెందారు. పాట్నాలోని  గాంధీ మైదానంలో రావణదహనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి భారీగా జనం తరలివచ్చారు. కార్యక్రమం ముగియగానే అంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

ఈ దుర్ఘటనలో 32మంది అక్కడికక్కడే మృతి చెందగా, దాదాపు 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దుర్ఘటనపై బీహార్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. అటు ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఆకతాయిల పనేనా...?

ముప్పయి రెండు చనిపోయిన ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దుర్ఘటనకు  ఎవరైనా కారణం ఉన్నారా అనే కోణంలో ధర్యాప్తు సాగుతోంది. అయితే గాంధీ గ్రౌండ్ లో కొందరు ఆకతాయిలు హడావుడి చేయటం వల్ల తోపులాట జరిగిందని ఘటనాస్థలంలో ఉన్న కొందరు తెలిపారు. దీంతో వారికోసం గాలింపు చేపడుతున్నారు. దురుద్దేశంతో ఇలా చేశారా.. లేక మామూలుగానే జరిగిందా అనే కోణంలో ధర్యాప్తు  చేస్తున్నారు.

నిజంగా ఆకతాయిల పనే అయితే వారు చేసిన పనికి అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. పండగ వేళ.., గ్రౌండ్ లో ఉన్న రద్దీని పట్టించుకోకుండా కేవలం తమ సరదా కోసం చేసిన పనికి 32మంది బలయ్యారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంట్లో ఉగ్రకోణం ఉంటే మాత్రం అంతా భయపడాల్సిందే. ఎందుకంటే బాంబులను పెట్టి ప్రజలను బలితీసుకునే ఉగ్రవాదులు ఇప్పుడిలా నోటి మాటలతోనే ప్రజలను చంపేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ  జరిగితే కానీ  పూర్తి వివరాలు బయటకు వస్తాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayadashami  stampade  patna  latest news  

Other Articles