సరదాల దసరా పండగ బీహార్ కు విషాదాన్ని మిగిల్చింది. కన్నులపండువగా సాగిన ఉత్సవాలు చివరిసమయంలో కన్నీళ్ళను తెప్పించాయి. బీహరా్ రాజధాని పాట్నాలో జరిగిన తొక్కిసలాటలో 32మంది దుర్మరణం చెందారు. పాట్నాలోని గాంధీ మైదానంలో రావణదహనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి భారీగా జనం తరలివచ్చారు. కార్యక్రమం ముగియగానే అంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఈ దుర్ఘటనలో 32మంది అక్కడికక్కడే మృతి చెందగా, దాదాపు 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దుర్ఘటనపై బీహార్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. అటు ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఆకతాయిల పనేనా...?
ముప్పయి రెండు చనిపోయిన ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. దుర్ఘటనకు ఎవరైనా కారణం ఉన్నారా అనే కోణంలో ధర్యాప్తు సాగుతోంది. అయితే గాంధీ గ్రౌండ్ లో కొందరు ఆకతాయిలు హడావుడి చేయటం వల్ల తోపులాట జరిగిందని ఘటనాస్థలంలో ఉన్న కొందరు తెలిపారు. దీంతో వారికోసం గాలింపు చేపడుతున్నారు. దురుద్దేశంతో ఇలా చేశారా.. లేక మామూలుగానే జరిగిందా అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు.
నిజంగా ఆకతాయిల పనే అయితే వారు చేసిన పనికి అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. పండగ వేళ.., గ్రౌండ్ లో ఉన్న రద్దీని పట్టించుకోకుండా కేవలం తమ సరదా కోసం చేసిన పనికి 32మంది బలయ్యారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంట్లో ఉగ్రకోణం ఉంటే మాత్రం అంతా భయపడాల్సిందే. ఎందుకంటే బాంబులను పెట్టి ప్రజలను బలితీసుకునే ఉగ్రవాదులు ఇప్పుడిలా నోటి మాటలతోనే ప్రజలను చంపేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిగితే కానీ పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more