దేశంలో ముఫైయవ రాష్ట్ర అవిర్భావం కోసం కోత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తమ ప్రాంతాన్ని ముఫైయవ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ ను ఆక్కడి అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఎక్కడ అనుకుంటున్నారా.. ఎవరు తీర్మాణం చేశారో తెలుసా..? దేశంలో అనేక ప్రాంతవాసులు తమ ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా అసెంబ్లీలో బిల్లు అమోదం పొందలేదు. కానీ ఇక్కడ అసెంబ్లీ తీర్మాణాన్ని చేసి కేంద్రానికి పంపింది. అదే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి.
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ.. తీర్మానాన్ని వాయిస్ ఓటు రూపంలో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం ఎన్.రంగస్వామి ప్రవేశపెట్టారు. అయితే, రాష్ట్రంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానాన్ని సవరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీన్ని తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రతిపక్ష నేత వి.వైతిలింగం మాట్లాడుతూ రాష్ట్రంగా ప్రకటిస్తే ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే తీర్మానంలో ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలనే డిమాండ్ను చేర్చాలన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more