దేశ ప్రజల ఇచ్చిన విప్లవాత్మక తీర్పుతో కేంద్రంలో తొలిసారి బీజేపి పార్టీ పూర్తి మోజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పటు చేసి నాలుగు నెలలు కావస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోడీ అగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగుర వేశారు. ఆయన ప్రసంగాన్ని కూడా లైవ్ లో చూపిన దూరదర్శన్ ఎందుకిలా చేస్తోందో అర్ధం కావడం లేదు. తప్పులపై తప్పులు చేస్తూ.. చివరకు వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల చైనా అధ్యక్షుడు మనదేశంలో పర్యటించిన సమయంలో ఆయన పేరు ముందున్న 'ఎక్స్ఐ' అనే ఆంగ్ల అక్షరాలను రోమన్ సంఖ్యలుగా పొరబడిన ఓ న్యూస్రీడర్...దానిని 'ఎలెవన్'(పదకొండు) అంటూ చదవడం సంచలనానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సదరు న్యూస్ రీడర్ ఉద్యోగం కూడా పోగొట్టకున్నా.. మార్పలు మాత్రం కనబడడం లేదు. అంతేకాదు అనంతరం కనివిని ఎరుగని రీతిలో కాశ్మీరు వరదలు విలయతాండవం చేసిన సమయంలోనూ అనంత్నాగ్ అనడానికి బదులు ఇస్లామాబాద్ అనీ...శంకరాచార్య హిల్కు బదులు సులేమాన్హిల్ అనీ అక్కడి డీడీ కరస్పాండెంట్ పేర్కొనడమూ ఇబ్బందికర పరిస్థితికి కారణమైంది.
ఇక తాజాగా ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉంటే...మరో వైపు దూరదర్శన్లో మోడీకి బదులు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ విజువల్స్ను చూపటం చర్చనీయాంశమైంది. దీనిని అనుకోని పొరబాటుగా దూరదర్శన్ వర్గాలు పేర్కొన్నాయి. మోడీ అమెరికా పర్యటనకు సంబంధించిన వార్తాకథనాల ప్రసారంలో భాగంగా మోడీకి బదులు మన్మోహన్సింగ్ విజువల్ చూపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు దూరదర్శన్ సీనియర్ అధికారులు తెలిపారు.
దూరదర్శన్ అనగానే మనకు నూరుశాతం విశ్వసించే ఛానెల్ గా భావిస్తాం. పోటీ ప్రపంచంలో వార్తలను ముందుగా ఇవ్వాలని ఖచ్చితమైన సమాచారానికి బదులు తమకందిన సమాచారాన్నే ముందుగా ప్రసారం చేస్తుంటాయి పలు ఛానెళ్లు. అయితే అత్యంత క్రీయాశీలక సమయాల్లో ఈ ఛానెళ్లు అందించే సమాచారాన్ని పరిగణలోకి తీసుకోని ప్రజలు దూరదర్శన్ పైనే ఆధారపడుతుంటారు. అలాంటిది దూరదర్శనే.. తప్పులు మీద తప్పులు చేస్తుంటే.. ఏమైందనుకోవాలి.? ఎవరిని విశ్వసించాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more