తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కొన్ని కార్యక్రమాలను చకాచకా పూర్తి చేసి విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అంతెందుకు.. ఆ పార్టీ గెలిచిందని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో ఘనంగా వేడుకలు కూడా జరుపుకున్నారు. కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేస్తారంటూ ప్రజలు ఆయనమీదున్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కొన్నాళ్లపాటు అంత సవ్యంగానే జరిగిందీ కానీ... ప్రస్తుతం ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు వెల్లువడుతున్నాయి. నిన్నమొన్నటివరకు ఎవరైతే జేజేలు కొట్టారో.. వాళ్లే ఇప్పుడు నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఘాటుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయినా.. ఇంతవరకు పేదప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని... రైతుల రుణమాఫీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తెలంగాణ రైతులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు. మరోవైపు కేసీఆర్ ఇంతవరకు రుణాలను మాఫీ చేయలేదనే బెంగతో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక తమ జీవితాలను బాగుపరుస్తాడని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న గిరిజనుల్లో వేలమంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ కొన్నివేలమంది గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ.. తమ జీవన గమనాన్ని ముందుకు సాగించేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాగే ఎంతోమంది పేదోళ్లు కేసీఆర్ ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తారా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇటీవలే ఆదిలాబాద్ లో వున్న ఆదివాసీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వారి చేసిన ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు అక్కడ వేలాదిమంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అటువంటివారి మీద దృష్టి సారించకుండా... అనవసరమైన పనుల కోసం ఖర్చులు పెడుతోందని రాజకీయ విశ్లేషకులతోపాటు తెలంగాణ ప్రజలు కూడా మండి పడుతున్నారు. పోలీసుశాఖ మార్పుకోసం, క్రీడాకారులకు బహుమానాలు ఇవ్వడం(ముఖ్యంగా సానియా మీర్జాకు కోట్లు ధారబోయడం), ఉద్యోగస్తులకు పండుగ సందర్భంగా బోనస్ లు ఇవ్వడం ఇంకా ఇతర వ్యవహారాలపై ప్రభుత్వం ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు రైతులు, గిరిజనులు మృత్యువాతలు పడుతుంటే.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా ఖర్చులు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ఇక్కడ విశ్లేషకులతోపాటు తెలంగాణ ప్రజలే కేసీఆర్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చులు చేయడమేకాకుండా, సంక్షేమ పథకాల నిర్వహణలో ఆలస్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కేసీఆర్ ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు, చెప్పిన పథకాలు బాగానే వున్నాయి గానీ.. వాటిని పేదప్రజల వరకు త్వరగా అందచేస్తే ఇంకా బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయంపై కేసీఆర్ ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more