We will obstruct janmabhoomi programme says raghuveera reddy

andhra pradesh, janmabhoomi, raghuveera reddy, pcc chief, obstruct, programme, congress, chandrababu

we will obstruct janmabhoomi programme says raghuveera reddy

ఇదేనా నీ ఘనమైన చరిత్ర బాబూ..

Posted: 09/23/2014 06:12 PM IST
We will obstruct janmabhoomi programme says raghuveera reddy

ఇదేనా నీ ఘనమైన చరిత్ర బాబూ.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. నిన్ను ధూషించిన వారిని కూడా టీడీపీలో చే్ర్చుకుని వారికి ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించుకున్న చరిత్ర నీది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని దూషించి.. ఆ పార్టీలో చేరి ప్రజాప్రతినిధులైన వారి సంగతి మర్చిపోయాడు రఘువీరా. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చాడు పీసీసీ చీఫ్.. నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్న బాబు... ఆదర్శ రైతలను తొలగించడంపై నిలదీశాడు. దసరాలోపు 30వేల మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ జారీచేసిన జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేశాడు.

ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ వాళ్లేననడం సరికాదని, ఆదర్శ రైతుల్లో అన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను టీడీపీలో చేర్చుకోవడంలో లేని అభ్యంతరం ఆదర్శ రైతుల విషయంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆదర్శ రైతులను కొనసాగించాలనే డిమాండుతో ఈనెల 25న ఇందిరాపార్కు వద్ద రెండు రాష్ట్రాల ఆదర్శరైతుల ధర్నాచేపట్టనున్నట్లు చెప్పారు.

ఏపీలో 27వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లించాల్సిందేనని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. డ్వాక్రా యానిమేటర్లు, ఆదర్శ రైతు సమాఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. దసరా పండుగలోపు వారి వేతన బకాయిలను చెల్లించకపోతే.. జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. డ్వాక్రా యానిమేటర్లు, ఆదర్శ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రఘువీరా చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  janmabhoomi  raghuveera reddy  pcc chief  

Other Articles